Thursday, January 31, 2013

సగ్గు బియ్యం వడలు


సగ్గు బియ్యం వడలు

కావలసిన పదార్ధాలు;-

సగ్గుబియ్యం ; 2 కప్పులు
మైదాపిండి ; 1 కప్పు
బియ్యపుపిండి ; అర కప్పు
ఉప్పు ; 1 స్పూన్
పచ్చిమిరపకాయలు ; 8
బంగాళదుంపలు ; 3

తయారుచేసే విధానం ;-

ముందుగ సగ్గుబియ్యాన్ని రెండు గంటల సేపు నీటిలో నానపెట్టాలి.తరవాత బంగాళా దుంపలను ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.ఒక గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని బంగాళా దుంపల పేస్ట్ ని ,మైదాపిండిని,బియ్యపుపిండిని వేసి పచ్చిమిరపకాయలను కూడా గ్రింద్ చేసి వేసి ,వుప్పుకుడా వేసి బాగా కలపాలి.తరవాత స్టవ్ మీద బాండి పెట్టి దానిలో నునే పోసి నునే వేడెక్కాక ఇందాక మనం కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఒక కవర్ మీద కొద్దిగా నునే రాసి చిన్న ముద్దా తీసుకుని వడ లాగ వత్తి నూనెలో వేసి దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి. అంతే వేడి వేడి ఘుమఘుమ లాడే సగ్గుబియ్యం వడలు రెడీష్టమైన వాళ్ళు ఈవదలలో కరివేపాకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకోవచ్చు .

0 comments:

Post a Comment