Monday, July 18, 2016

తీయని గులాబీలు

మైదా-అరకేజీ 
వరిపిండి-అరకేజీ
గోడుమపిండి-పావుకేజీ
యాలకులపొడి-చెంచ
వంటసోడా-చిటికెడు
చక్కర-అరకెజీ
నూనె-వేయించుకోడానికిసరిపడా
గిన్నెలోనూనెతప్ప మిగిలినపదార్ధములను ఒక్కోటితీసుకోవాలి.అన్నిటినిఒకసారి
కలిపి ఆతరువాత సరిపడానీటితోదోసపిండిలా చేసుకోవాలి.బాండిలో సరిపడానూనె
వేసిబాగావేడి చేయాలి.తరువాతగులాబీలు వేసేకాదనుపిండిలోముంచి వేడినూనెలో
ఉన్చేయాలి.పిండివేగగానేకాడ నుంచి విడిపోయి పువ్వుల వస్తుందిఇలామిగిలినపిండినికూడాచేసుకోవాలి

Sunday, July 17, 2016

వెన్న జంతికలు

బియ్యంపిండి -అరకేజీ 
కారం -ఒక టీ స్పూన్ 
పసుపు -అర టీ స్పూన్ 
వెన్న -రెండువంద లు గ్రాములు
వాము-ఒక టేబుల్ స్పూన్
మినపప్పు-యాభయ్ గ్రాములు
నూనె-వేయించడానికి సరిపడా
ఉప్పు-కొద్దిగా
కొత్తిమీర-రెండురెమ్మలు
స్టవ్వెలిగించి కడాయిపెట్టుకునివేడి చేసుకోవాలి.అందులో మినపప్పువేసిలో ఫ్లేమ్లో
అయిదు నిమిషాల వరకువేయించాలి.వేయించిన మినపప్పునుచల్లార్చి
మిక్సి జార్లోకి తీసుకొనిమెత్తచేసుకోవాలి.grindచేసుకున్నపిండిని ఒకప్లేట్ లోజల్లించుకోవాలి.
బియ్యంపిండిలో మిక్సిపట్టినమినపప్పునువేసుకోవాలి.స్టవ్ వెలిగించి ఒకగిన్నెపెట్టి
అందులో వెన్నవేసిబాగాకాగాబెట్టాలి.అడినురగ వచ్చేంతవరకు.
కాగినవెన్ననుపిండిలో వేసుకోవాలి.తర్వాతపసుపు,కారంఉప్పు,వామువేసుకోవాలి
కొత్తిమీరనుబాగాచిన్నగాకట్చేసిఅందులోవేసిపిండిలోపదార్దాలను బాగాకలిసేలాకలుపుకోవాలి.
పొడిపొడిగవచ్చినతర్వాతకొంచెంనీరుకలుపుకునిజంతికలపిండిలబాగాకలుపుకోవాలి
జంతికల గొట్టంలో నక్షత్రపు ఆకారంలోఉన్నమరనుపెట్టి మనంవేయించుకునేగరిటెనుబోర్లించిదానిపైనరౌండ్గఅనుకునివేడిఅయిననూనెలోతిప్పివేసుకోవాలి.మీడియం ఫ్లేమ్లోపెట్టిరెండువైపులావేయించుకోవాలి

Thursday, July 14, 2016

మెంతిగుండ

మెంతులు ఆరోగ్యానికి, షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచివని మనకు తెలిసిందే ! అయితే, చేదుగా ఉండటంవల్ల వాటిని పోపుల్లో తప్ప మరెక్కడా వాడము. అయితే వీటినే 'మెంతి గుండ' గా తయారుచేసి పెట్టుకుంటే, అనేకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అవి చెప్పే ముందు తయారీ విధానం చూద్దాము.
మెంతి గుండ
---------------
ఆవాలు - 4 స్పూన్లు
మెంతులు - 4 స్పూన్లు
ఎండుమిర్చి - 10-15
నూనె - ఒక స్పూన్
ముందుగా మూకుడులో నూనె వేసి, పైవన్నీ వేసేసి ఎర్రగా వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా పొడి చేసి, ఆరాకా ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. నిజానికి మన పూర్వీకులు ఇళ్ళలో ఎప్పుడూ దీన్ని సిద్ధం చేసి ఉంచేవారు.
ఉపయోగాలు
------------------
౧.ఉప్పులో వేసిన లేక తాజా గోంగూర, నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ, మెంతిబద్దలు(దీనికి మాత్రం మిక్సీ అక్కర్లేదు, చిన్నచిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వాడచ్చు), వంటి వాటికి క్రింది ఫార్ములా వాడెయ్యచ్చు.
మిక్సీలో మెత్తగా రుబ్బిన పచ్చడి + రెండు స్పూన్ల మెంతి గుండ + ఒక స్పూన్ కారం + తగినంత ఉప్పు - కలిపేసి, నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపు వేసేస్తే, తాజా పచ్చళ్ళు తయారవుతాయి.
౨. దప్పళం, తోటకూర పులుసు, పులిహోర వంటివి కలిపేటప్పుడు ఒక చెంచా మెంతి గుండ వేస్తే, ఆ రుచే వేరు.
౩. అప్పటికప్పుడు ఇడ్లీ, దోశ లోకి పచ్చడి చెయ్యాలంటే - ఇలా ప్రయత్నించి చూడండి.
తరిగిన మామిడికాయ ముక్కలు + 2 స్పూన్ల మెంతి గుండ + రెండు చెంచాల బెల్లం పొడి + 2 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర - మిక్సీ తిప్పేసి, పోపేస్తే చక్కటి మామిడికాయ పచ్చడి తయారు. ఒకసారి రుచి చూస్తే, మరి వదలరండోయ్.

Wednesday, July 13, 2016

వేరుశెనగ '' పాయసం ''

కావలసినవి: వేరుశెనగపప్పు వందగ్రాములు, పాలు అరలీటరు, కి స్‌మిస్ 25గ్రాములు, తెల్లగోధుమలు వందగ్రాములు, నెయ్యి రెండుస్పూన్లు, పెసలు యాభైగ్రాములు, పంచదార రెండువందల గ్రాములు, జీడిపప్పు పలుకులు తగినన్ని.

తయారీ: ముందుగా వేరుశెనగపప్పును మిక్సీలో వేసి తగినన్ని నీళ్లుపోస్తూ మెత్తగా రుబ్బుకుని వడగట్టి పాలు తయారుచేసుకోవాలి. ఇలా ఒక కప్పు పాలు తీయాలి. గోధుమలు, పెసలు కుక్కర్‌లో ఉడి కించి చల్లారనివ్వాలి. జీడిపప్పును కొద్దిగా నెయ్యి వేసి వేగించాలి. మిగతా నెయ్యిలో ఉడికించిన గోధుమలు, పెసలు వేసి కొద్దిగా వేగించి అందులో వేరుశెనగపాలు, మామూలు పాలు, చక్కెర వేసి బాగా మరిగించాలి. చివరగా వేగించిన జీడిపప్పు, యాలకులపొడి, కిస్‌మిస్‌లు వేసి బాగా కలిపిదించుకోవాలి.

Tuesday, July 12, 2016

కిచిడి

బియ్యం -ఒక కప్పు 
పెసరపప్పు -అరకప్పు (బియ్యాన్ని,పెసరపప్పును ఒకగిన్నేలోవేసుకోవాలి.అవి
రెండుకలిపిబాగాకడగాలి.దానినిముప్పై నిముషాలు నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-రెండు,చిన్నగాకట్చేసి పెట్టుకోవాలి
బంగాళదుంప-ఒకటి
టొమాటోలు-మూడు
కార్రోట్-ఒకటి మీడియంసైజు
నెయ్యి-రెండుటేబుల్స్పూన్స్
జీలకర్ర-అరటీస్పూన్
కరివేపాకు,కొత్తిమీర-రెండురెమ్మలు
అల్లంవెల్లుల్లిపేస్టు-ఒకటీస్పూన్
అల్లంముక్క-చిన్నముక్క
మసాలకారం-ఒకటీస్పూన్
మిరియాలపొడి-చిటికెడు
ఉప్పు-రుచికిసరిపడా
కుక్కర్ తీసుకునిబాగానానిన బియ్యం,పెసరపప్పును వేయాలి.కారెట్,పచ్చిమిర్చి
,ఉల్లిపాయముక్కలువేసుకోవాలి.టమాటో ముక్కలు వేసుకోవాలి.
రెండుకప్పులనీళ్ళుపోసుకోవాలి.రుచికిసరిపడా ఉప్పువేసుకోవాలి.
అల్లంవెల్లుల్లిపేస్టు వేసుకోవాలి.మిరియాలపొడి వేసుకోవాలిమసాలకరంలేకుంటేగరంమసాలా వేసుకోవచ్చు.ఒకటీస్పూన్
నెయ్యివేసుకోవాలి.మూతపెట్టిఉడికించుకోవాలి.
స్టవ్వెలిగించిమీడియంఫ్లేమ్లోపెట్టి మూడువిసిల్స్ వచ్చేదక ఉడికించుకోవాలి
ఆవిరి పోయినతరువాతమూతతీసి చూస్తెకూరముక్కలు,పెసరపప్పు,అన్నం
బాగాఉడికిఉంటాయి.
స్టవ్వెలిగించికడాయి పెట్టి వేడిచేసినెయ్యివేసుకోండి.నేతి తో తాలింపు పెట్టుకుంటే
రుచిబాగుంటుంది.జీలకర్రవేసుకోవాలి.కట్చేసిపెట్టుకున్న అల్లంముక్కలువేసుకోవాలి
ఒకనిమిషం పాటువేపాలి.కరివేపాకువేసుకోవాలి.బాగాఉడికినకిచిడిని
లో ఫ్లేమ్లోపెట్టివేపుకోవాలిఒకగిన్నెతీసుకొని అందులోకిచిడి వేసుకోవాలి
పైనకొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి

Wednesday, July 6, 2016

• మజ్జిగ ఇడ్లీ

* కావలసినవి:
బొంబాయిరవ్వ: రెండున్నర కప్పులు, మజ్జిగ: 4 కప్పులు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా, మినపప్పు: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, ఆవాలు: టీస్పూను, తాజా కొబ్బరితురుము: 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి), కరివేపాకు: 2 రెబ్బలు, ఇనో ఫ్రూట్‌ సాల్ట్‌: టేబుల్‌స్పూను.
* తయారుచేసే విధానం:
* ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, 2 టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
* చిన్న పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే క్యారెట్‌ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్‌సాల్ట్‌ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండిమిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి.
ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.

• బీరకాయ గారెలు

* కావలసినవి:
బీరకాయలు: పావుకిలో, మినప్పప్పు: 200గ్రా., పండుమిర్చి:నాలుగు, పచ్చిమిర్చి: మూడు, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: రెబ్బ, అల్లం తురుము: 2 టేబుల్‌స్పూన్లు,జీలకర్ర: టీస్పూను, నూనె: తగినంత

* తయారుచేసే విధానం:
మినప్పప్పుని రాత్రే నానబెట్టాలి.బీరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.పండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలుగా కోయాలి. వీటికి అల్లంతురుము, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర చేర్చి మిక్సీలో రుబ్బాలి. తరవాత బీరకాయ ముక్కలు, నానబెట్టిన పప్పు వేసి మెత్తగా రుబ్బాలి.మిశ్రమాన్ని గారెల మాదిరిగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.