Friday, December 12, 2014

అరటికాయ పుణుకులు .


కావాల్సిన పదార్ధాలు ;-
అరటికాయలు -- 2
మజ్జిగ -- ఒకకప్పు
ఉప్పు -- ఒక టీ స్పూన్
అల్లం -- అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు -- 6
కారం -- అర టీ స్పూన్
వంటసోడా -- పావు టీ స్పూన్
మైదాపిండి -- ఒక కప్పు
బియ్యపు పిండి -- అర కప్పు
నూనె -- పావు కేజీ
కరివేపాకు -- రెండు రెమ్మలు
తయారుచేసే విధానం;-
ముందుగ అరటికాయలను పెచ్చు తీసి కట్ చేసి బాగా కడిగి గ్రైన్దర్ గిన్నెలో వేసి మజ్జిగ పోసి ఉప్పు,అల్లం వేసి మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి . ఇప్పుడు రుబ్బిన అరటికాయ పేస్టు లో మైదాపిండి ,బియ్యపుపిండి, వంటసోడా ,పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకు ,కారం వేసి బాగా కలపాలి . తరవాత ఒక బాండి లో నూనె పోసి స్టవ్ మీద పెట్టి నూనె కాగాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండిని చిన్నచిన్న ఉండలుగా నూనెలో వేసి దోరగా వేయించాలి .. మొత్తం పిండిని ఇలానే వేయించాలి . అంతే ఘుమఘుమ లాడే కరకర లాడే అరటికాయ పుణుకులు రెడీ ......... ఇవి చట్నీ తోను ,చట్నీ లేకుండా కూడా తిన్న కూడా బావుంటాయి .... మజ్జిగతో చేసినవి కనుక పుల్లగా,కారంగా రుచిగా ఉంటాయి 

'అలసంద గుగ్గిళ్ళు'


కావలసిన పదార్ధాలు:
అలసందలు : పావు కిలో 
( చల్లటి నీళ్ళల్లో సుమారు 6 గంటల సేపు నాన్చాలి - తర్వాతా నీళ్ళు వడగట్టి......నానిన 'అలసంద' లను ఓ గిన్నెలో ఉంచండి.)

గుగ్గిళ్ళు చేయడానికి ముందు కావలసినవి:
నానిన అలసంద లు
రెండు/ మూడు పచ్చి మిర్చి ముక్కలు.
కరివేపాకు : కొద్దిగా...
పచ్చికొబ్బరి కోరు : పావు కప్పు.

పోపు కోసం:
మినప్పప్పు : ఒక టీ స్పూన్,
ఆవాలు : అర టీ స్పూన్.
ఇంగువ పొడి : చిటికెడు
ఎండు మిర్చి : రెండు చిన్న ముక్కలు..
వంట నూనె : రెండు టీ స్పూన్లు...

రుచికి సరిపడా : ఉప్పు...

చేసే విధం:
స్టవ్ మీద విశాలమైన బాణలి/ కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక.....

వరుసగా పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, నానిన అలసందలు, ఉప్పు చేర్చి చక్కగా గరిట తో కలిపి, మూతపెట్టి .......సన్నని మంటపై ఓ రెండు మూడు నిమిషాలు ఉంచాలి....
ప్లేట్ల లో సర్వ్ చేసేముందు....దానిపై కొబ్బరి కోరు చల్లి డెకరేట్ చేయండి...కావలిస్తే నిమ్మకాయ పిండుకోవచ్చు....ఎంజాయ్...(వేడి వేడిగా తింటేనే.....మజా.....)

Monday, December 1, 2014

(గోధుమ + జొన్న) రొట్టె

1) గోధుమపిండి ఒక భాగం , జొన్నపిండి రెండు భాగాలు , పుదినా , కొత్తిమీర పేస్టు కలిపి , తగినంత ఉప్పు కలిపి ,పెనం మీద వేసి రొట్టెలు లా తయారు చేసుకోవాలి. (ఈ రొట్టెలు చేసేటప్పుడు పాలకూర లేదా మెంతి కూర పేస్టు కూడా కావాలంటే కలుపుకోవచ్చు)
2) ఈ రొట్టెలలో పుష్కలంగా ఐరన్ , ప్రోటీన్ , ఫైబర్ (పీచు పదార్ధం) ఉంటుంది. కావాల్సిన కాల్షియమ్ కూడా అందుతుంది.
3) ఎవరైతే అధికబరువు , డయాబెటిస్ తో బాధపడుతున్నారో అలాంటి వారు , రాత్రి అన్నానికి బదులుగా , ఈ రొట్టెలు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ , కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
4) రాత్రి పూట 2 నుండి 4 రొట్టెలు వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రొట్టెలలో కార్బోహైడ్రేట్ లెవెల్స్ చాల చాల తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో గ్లూకోస్ లెవల్స్ , కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగవు.
5) ఈ రొట్టెలు తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి , చల్లగా తీసుకొంటే కడుపులో వేడి చేయదు.

Wednesday, October 22, 2014

నిమ్మకారం

కావాల్సిన పదార్ధాలు ;-

నిమ్మకాయలు -- 12
ఉప్పు -- 3 టీ స్పూన్స్
కారం -- 5 టేబుల్ స్పూన్స్
మెంతులు -- 2 టీ స్పూన్స్
పసుపు -- పావు టీ స్పూన్

తయారుచేసే విధానం ;-

ముందుగ మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి . మెంతులు వేయించడానికి నూనె అవసరం లేదు . తరవాత నిమ్మకాయలు బాగా తడి లేకుండా తుడిచి రసం తీయాలి . ఇప్పుడు ఆ రసంలో ఉప్పు,కారం ,పసుపు,మెంతి పొడి వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి . అంతే ఘుమఘుమలాడే నిమ్మకారం రెడీ ........... అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాల రుచిగా వుంటుంది . ఇడ్లీ,దోశ ల్లోకి కూడా బావుంటుంది ....

Saturday, September 13, 2014

గ్రీన్ టీ విత్ తులసి

 '
 
·         కావలసినవి:
నీళ్లు - 2 కప్పులు; గ్రీన్ టీ + తులసి టీ బ్యాగులు - 2; పంచదార - 2 టీ స్పూన్లు
·         తయారీ: 
నీళ్లను మరిగించాక, అందులో టీ బ్యాగ్ వేసి రెండు మూడు నిమిషాలు ముంచి తీస్తూ చేయాలి. అలా చేయడం వలన వాటిలో ఉండే ఫ్లేవర్ టీ లోకి వస్తుంది. (వీటిని నీటితో కలిపి మరిగించకూడదు. సాధారణంగా ఒక కప్పు టీ కి ఒక బ్యాగ్ సరిపోతుంది)
·         పంచదార జత చేయాలి. ఇష్టపడేవారు పాలు కూడా కలుపుకోవచ్చు.

* పుదీనా టీ

కావలసినవి:
పుదీనా ఆకులు - రెండు టీ స్పూన్లు; సోంపు - అర టీ స్పూను; ఎండు అల్లం - చిటికెడు
తయారీ
ఒక కప్పులో మరిగించిన నీళ్లు పోయాలి
పుదీనా ఆకులు, సోంపు, ఎండు అల్లం వేసి మూత ఉంచి ఐదు నిమిషాల తర్వాత వడ గట్టి తాగాలి.

Friday, September 12, 2014

పనీర్ బటర్ మసాల

కావలసినవి:
పనీర్ - 100 గ్రా, బటర్ - ఆరు టీ స్పూన్లు, క్రీమ్ - నాలుగు టీ స్పూన్లు, జీడిపప్పులు- పది, టొమాటో గుజ్జు - రెండు కప్పులు, ఉల్లిపాయలు- రెండు (సన్నగా తరగాలి), పసుపు, ఫుడ్ కలర్, ఏలకుల పొడి - చిటికెడు, కారం - రెండు టీ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూన్, ధనియాల పొడి- టీ స్పూన్, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట
తయారి:
పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి. బాణలిలో బటర్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఏలకులపొడి, ఉల్లిపాయ తరుగు, ధనియాలపొడి, జీడిపప్పులు, పసుపు, ఉప్పు, కారం వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి అందులో టొమాటో గుజ్జు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత పనీర్ ముక్క లు, ఫుడ్ కలర్, క్రీమ్ వేసి స్టౌ మీద అయిదారు నిమిషాలు ఉడికించి దింపేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నీష్ చెయ్యాలి. పనీర్ బటర్ మసాలను రోటీస్‌లో కాని చపాతీలతో కాని తింటే చాలా బాగుంటుంది.

Monday, September 1, 2014

కుడుములు

కుడుములు 

కావలసినవి: 
బియ్యపు రవ్య - గ్లాసు; శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము - కప్పు; ఉప్పు - తగినంత 

తయారి: 
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తర్వాత దించి, కొబ్బరి కలపాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్లలో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత ప్రసాదానికి తీసుకోవాలి.

Monday, August 18, 2014

శెనగల సలాడ్

శెనగలను చోలే లేదా చెన లేదా చిక్ పీస్ గా పిలుస్తుంటారు. వీటితో తయారు చేసే వంటలంటే చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టమే. రెగ్యులర్ వెజిటేబుల్స్ తో బోరు కొట్టినప్పుడు కొంచెం రుచి మార్చడానికి మరియు శ్రావణమాసంలో వర్షకాలంలో, ఆరోగ్యకరంగా మరియు రుచికరంగా ఉండటానికి శెనగలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది హై న్యూట్రీషియన్ ఫుడ్ . కాబీళీ చెన్న హార్ట్ పేషంట్లకు కూడా చాలా ఆరోగ్యకరమైనది ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మరియు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ శెనగలతో సలాడ్ మీకోసం...

కావలసిన పదార్థాలు:
శనగలు (ఉడికించినవి) : 3cups
బంగాళదుంప: 1 (ఉడికించి, ముక్కలు చేయాలి),
పసుపు: చిటికెడు
పచ్చిమిర్చి: 1(సన్నగా తరగాలి)
ఉల్లితరుగు: 2tbsp
టొమాటో: ఒకటి(సన్నగా తరగాలి)
పంచదార: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: చిటికెడు
కొత్తిమీర తరుగు: tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో తరుగులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి.

2. తర్వాత ఉడికించిన శెనగలను పై మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే శ్రావణ మాసపు శెనగల సలాడ్ రెడీ. వీటిని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు.

నోట్: మొలకెత్తిన శనగలకు కొద్దిగా నీరు కలిపి, 2 నిమిషాలు ఉడికించి సలాడ్‌కి వాడుకుంటే బాగుంటాయి.

Thursday, July 24, 2014

టొమేటో గ్రేవీ ఆలూ గుత్తివంకాయ



కావలసినవి:  గుత్తివంకాయకు వాడే వంకాయలు – 6, ఆలుగడ్డ – 1, ఉల్లిపాయలు – 4, టొమేటోలు – 4, కేరట్ – 1, ఉడికించిన పచ్చి బటానీలు, ఎర్రకారం, ఉప్పు, ఒక స్పూను MTR సాంబారు పొడి, కొంచెం జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర.
తయారు చేసే విధానం:  వంకాయలు గుత్తిగా కొయ్యాలి. ఆలుగడ్డ, ఉల్లిపాయలు ముక్కలుగా తరుగుకోవాలి.
స్టౌ వెలిగించి మూకుడు పెట్టి, నూనె, నీళ్ళు కలిపి వెయ్యాలి.  అందులో గుత్తివంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు వేసి, మూత పెట్టి సన్నమంట మీద మగ్గనివ్వాలి.  తరువాత వీలును బట్టి మంట పెద్దది చేసుకోవచ్చు.  నీళ్ళన్నీ ఇగిరిపోయి నూనెలో వున్నట్లే వుండి మెత్తగా మగ్గుతాయి.  నాలుగు టొమేటోలు, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎర్రకారం మిక్సీలో రుబ్బి, ఆ గ్రేవీ కూరలో వేసి ఉడికించి, బటానీలు, కొత్తిమీర జల్లి కలియపెట్టాలి.  అప్పుడు ఒక స్పూను MTR సాంబారుపొడి చల్లాలి.  తరవాత పైన కేరట్ తురుము వెయ్యాలి.  ఈ కూర చాలా తేలికగా చిటికెలో అయిపోతుంది.  అతిథులొచ్చినప్పుడు చేస్తే చాలా బాగుంటుంది.

ఫ్రూట్ కస్టర్డ్

కావలసిన పదార్ధాలు : 1. పండ్లు 5,6 రకాలుచిన్నగాముక్కలుచెయ్యాలి.
[మామిడి,అరటి,యాపిల్,కమలా,ద్రా
క్ష,బొప్పాయి,దానిమ్మ.] నీరు వుండే పండ్లు అనగా పుచ్చకాయ లాంటివి పనికి రావు.2. బాదం ,జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ చిన్నముక్కలుగా చేసుకోవాలి. 3.పంచదార అరకిలో ,4. చిక్కటి పాలు ఒక లీటరు , 5.విక్ ఫీల్డు కస్టర్డ్ పౌడర్ 5 sp.

చేయువిధానం : పాలు బాగా మరగ నివ్వాలి. మరుగుతున్నప్పుడే అందులో చక్కెరవేసి బాగా కలుపుతూ వుండాలి. ఒక కప్పులో అరగ్లాసు చల్లని పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపాలి.వేడి పాలల్లో వేస్తే ఉండలు కట్టి ,గట్టిపడతాయి. పొరపాటున కూడా అలా చేయరాదు. కస్టర్డ్ కలిపిన చల్లటి పాలను జాగ్రత్తగా పోస్తూ, బాగా కలుపుతూ వుండాలి. లేకపోతే అడుగున ఉండలు కట్టి మాడిపోయి , కాటు వాసన వస్తుంది. పదార్ధం పూర్తిగా పాడయిపోతుంది . బాగా కలుపుతూవుంటే పాలు చిక్కగా అవుతాయి. స్టవ్ కట్టేసి , కలుపుతో,(మీగడ కట్టకుండా ) చల్లారనివ్వాలి. చల్లారాక ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
పండ్లని బాగా కడిగి ,శుభ్రం చేసి ,పొట్టు తీసి చిన్నముక్కలు చేసుకోవాలి. అరటి పండ్లు మాత్రం తినడానికి ముందు మాత్రమే కలపాలి.నల్లబడతాయి . పండ్ల ముక్కలమీద అరచెంచా నిమ్మరసం కలిపి ఫ్రిజ్ లో ఉంచితే చల్లగా వుంటాయి . 2,3 గంటలతరువాత కస్టర్డ్ లో పళ్ళముక్కలు ,డ్రై ఫ్రూట్ ముక్కలూ కలిపి , అందమైన గాజు బౌల్ లో పిల్లలకి అందించండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి ,ఎండలు బాగా వున్నాయి కాబట్టి ,స్కూల్ నుండి రాగానే చల్లగా మాంగో ఫ్రూట్ కస్టర్డ్ ఇస్తారుకదూ..

స్వీట్స్ (ఉషారాణి నూతలపాటి )రసగుల్లా

కావలసిన పదార్ధాలు : చిక్కటి పాలు 1 లీటరు , పంచదార అరకిలో ,నిమ్మరసం 1 పెద్దకాయ రసం , చిటికెడు  కుంకుమ పువ్వు , పిస్తా పప్పు కొద్దిగా. (పిస్తా ,కుంకుమ పువ్వు కావాలనుకుంటేనే వాడవచ్చు.)
చేయువిధానం : ముందుగా పాలని బాగా మరగనివ్వాలి. పాలు కాగినంతసేపు మీగడ కట్టకుండా కలుపుతూనేవుండాలి .బాగా మరిగినతరువాత స్టవ్ కట్టేసి , నిమ్మరసం లో ఒక స్పూన్ నీళ్ళు కలిపి , ఆ నిమ్మరసాన్ని పాలల్లో కొద్ది,కొద్దిగా కలుపుతూ వుండాలి .పాలు విరిగేవరకు అలా కలుపుతూ వుంటే పాలు విరిగిపోతాయి . విరిగిన పాలని అలాగే కలిపితే పాలు బాగా విరిగి , నీరు,విరుగు (చెనా ) స్పష్టంగా వేరుపడతాయి . చిల్లుల పళ్ళెం లో పల్చని బట్టవేసి అందులో పాలవిరుగు వెయ్యాలి . చెనా మీద బాగా నీటిని ధారగా పొయ్యాలి ,అప్పుడే నిమ్మరసం పులుపు కూడా పోతుంది. బట్టలోంచి నీరు మొత్తం దిగిపోతుంది. బట్టను మూటలా చేసి ,తేలికగా వత్తితే మిగిలిన నీరు కూడా బయటికి వస్తుంది. 2 గంటలసేపు ఆమూటను వేలాడదీస్తే మొత్తం నీరు దిగిపోయి ,చెనా మిగులుతుంది.
ఇప్పుడు స్టవ్ పైన మందపాటి పాత్రను వుంచి అరలీటరు నీరు పోసి, అందులో చక్కర వేసి , కరిగేవరకూ కలుపుతూ వుండాలి . బాగా కరిగిన తరువాత చక్కెరపాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి .
చెనా (పాలవిరుగు) ని ఒక పెద్ద ప్లేట్ లో కానీ ,చపాతీ పీటమీద కానీ వేసుకొని , మృదువుగా ,ఉండలు లేకుండా 5.6 నిముషాలసేపు కలపాలి. మృదువుగా ,వుండచేస్తే తేలికగా వుండకట్టేలా తయారు అవుతుంది. మొత్తం చెనాని సమానభాగాలుగా చేసి ,గుండ్రగా ఉండలు చెయ్యాలి. ఒక వెడల్పు పాత్ర స్టవ్ పై వుంచి లీటరు నీరు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో చెనావుండలు వేసి మూత పెట్టాలి. 7 ,8 నిముషాలపాటు అలాగే మరగనివ్వాలి .చెనావుండలు బాగా ఉడికి సైజ్ పెద్దగా అవుతాయి వాటిని పాకంలో వేసి చల్లారాక ,ఫ్రిజ్ లో వుంచి చల్లబరచాలి.పాకంలో కావాలనుకుంటే కుంకుమ పువ్వు (శాఫ్రాన్ )వేసుకోవచ్చు.పిస్తా సన్నగా తరిగి రసగుల్లాలమీద అలంకరించుకుంటే అద్భుతః .పాకంలో 2 చుక్కలు వనిల్లా ఎసెన్స్ (కావాలనుకుంటే )లేదా రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మంచి వాసనతో రుచిగావుంటాయి.
P.S. : ఒక్కోసారి పాలు విరిగిపోతాయి.అప్పుడు కూడా ట్రై చెయ్యవచ్చు. కానీ మరీ పాడయిన పాలు చేదువస్తాయి జాగ్రత్త !!

Monday, July 14, 2014

క్రిస్పీ కట్లెట్స్

క్రిస్పీ కట్లెట్స్

రెండు కప్పులు మిగిలిన అన్నం,                రెండు టేబుల్ స్పూన్ల శెనగ పిండి,
ఒక టేబుల్ స్పూన్ పెరుగు,                     రెండు పచ్చి మిరప కాయలు,
మూడు వెల్లుల్లి పాయలు,                        చిన్న అల్లం ముక్క,
( ఇష్టం లేనివారు మానెయ్య వచ్చు),           అర కప్పుడు తరిగిన కొత్తిమిరి,
ఒకొక్క టీ స్పూన్ కారం, ధనియా పొడి, పంచదార,
అర కప్పుడు వేరుసెనగ గింజలు, (అంటే పల్లీలు)
తగినంత ఉప్పు చిటికెడు పసుపు,               రెండు టేబుల్ స్పూన్ల నూని,
వేయించు కొనేందుకు కొద్దిగా నూని ( షాలో ఫ్రై కి ).

మధ్యాన్నం భోజనాల తరువాత మిగిలిన అన్నాన్నీ ఒక బౌల్ లో వేసి, దాన్లో పెరుగు, శెనగ పిండి, ఉప్పు పసుపు వేసి బాగా చేత్తో పిసికి మూత పెట్టి వదిలేయాలి. రెండు మూడు గంటలు నానితే బాగుంటుంది. టిఫిన్ రెడీ చేసే అరగంట ముందు దాన్ని తెసి బాగా పిసుక్కోవాలి. పల్లీలు, మిర్చి, వెల్లుల్లి కొత్తిమిరి కలిపి ముద్దలా చేసుకోవాలి. దాన్ని, నూనే, కారం, ధనియా పొడి, పంచదారల తో పిండిలో వేసి కలుపు కోవాలి. పల్చగా అనిపిస్తే కొచెం శెనగ పిండి కలుపుకోవచ్చు.  ఇంచుమించు పకోడీ పిండిలా ఉంటుంది. పాన్ వెచ్చ చేసీ కొంచెం నూనె వేసి దాంట్లో, కట్లెట్స్ షేప్ లో చేత్తోతట్టి వేయించు కోవాలి. టమాటో సాస్ గాని గ్రీన్ చట్ని తో గాని సర్వ్ చెయ్యండి.
లోపల మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటై.

కాకరకాయ సాంబార్

కాకరకాయ సాంబార్ కి కావల్సిన పదార్థాలు:
చిన్నగ్లాసు కందిపప్పు, కాకరకాయ 1, ఒక స్పూను MTR సాంబారు పొడి, ఇంగువ, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, చింతపండు, ఉప్పు.
తయారు చేసే విధానం:
          చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి.  కాకరకాయ చక్రాల్లా తరుగుకోవాలి.  స్టౌ వెలిగించి కుక్కరులో పప్పు ఉడికించుకోవాలి.  మూకుడులో నూనె వేసి కాకరకాయముక్కలు బాగా ఎర్రగా వేయించాలి.  వేగాక చింతపండు పులుసు పోసి, ఉప్పు, పసుపు వేసి, అందులో ఉడికిన పప్పు వేసి ఉడికించాలి.  ఆఖర్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, రెండు పచ్చిమిర్చి పోపులో వేయించి, కొంచెం ఎర్రకారం వేసి పులుసులో కలపాలి.  కావాలంటే కొత్తిమీర కూడా వెయ్యచ్చు.

Thursday, July 3, 2014

Usharani Nutulapati -చామదుంపఅంటుపులుసు-

ఇది చెయ్యడానికి కావలసిన పదార్ధాలు చూద్దాం.

కావలసిన పదార్ధాలు : చామదుంపలు ¼ కిలో , చింతపండు 20 గ్రా.,నూనె 2 sp., బియ్యప్పిండి 1 sp ., బెల్లం చిన్నముక్క,ఇంగువ పావుచెంచా ,జీలకర్ర మెంతుల పొడి 1 sp ,అల్లం వెల్లుల్లి పేస్ట్ ,గరంమసాలా1 sp,ఉల్లితరుగు
1 కప్పు ,కర్వేపాకు,కొత్తిమీర,పోపుదినుసులు, కారం ,ఉప్పు తగినంత.

చేయువిధానము : చామదుంప లు బాగా కడిగి ,కుక్కర్లో మూడు విజిల్స్ రానివ్వాలి. చల్లారాక పొట్టువలిచి వుంచుకోవాలి.పాన్ వేడి చేసి 2 sp నూనె వెయ్యాలి. నూనె వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించాలి. మసాలా ఇష్టమైన వారు అల్లం వెల్లుల్లి ముద్ద ,ఇష్టం లేని వారు ఇంగువ వేసుకోవాలి.కరివేపాకు కూడా వేసి ,తరువాత చామదుంపలు +పసుపు వేసి వేయించాలి. 3 ని బాగా కలిపి ,చింతపండు రసం చిక్కగా తీసి ముక్కలపైన పోయాలి.పులుసు ఉడుకు పట్టగానే, బియ్యప్పిండి లో నీళ్ళు కలిపి ,అందులోనే జీలకర్ర మెంతులపొడి , బెల్లం తురుము, ఉప్పు, కారం కూడావేసి ,పులుసుకు కలపాలి. మసాలా ఇష్టమైన వారు ఒక sp.గరం మసాలా పొడి వేసుకోవాలి.పులుసు చిక్కగా ,ఘుమ ఘుమ లాడుతూ తయారు అవుతుంది. కొత్తిమీర చల్లుకుంటే చామదుంప అంటు పులుసు రెడీ..అన్నం లోకి ,రోటీల్లోకి కూడా బావుంటుంది.

Saturday, June 14, 2014

ఇడ్లీ, దోసె, పెసరట్ల లోకి అల్లం చట్నీ

 కావలసినవి:  కొంచెం పుట్నాలపప్పు, అల్లంముక్క, ఎర్రకారం, కరివేపాకు, తీపికి సరిపడ బెల్లం, ఉప్పు, నానబెట్టిన చింతపండు.
తయారు చేసే విధానం:  చిన్న మిక్సీగిన్నెలో పుట్నాలపప్పు, అల్లంముక్క, ఎర్రకారం, కరివేపాకు, ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి.  తరువాత నానబిట్టిన చింతపండు, బెల్లంపొడి, నీళ్ళు పోసి మళ్ళీ తిప్పాలి.  తీపి, పులుపు మీకు తగినట్లుగా వేసుకోండి.
ఈ చట్నీ ఇడ్లి, దోసెల్లోకి, పెసరట్లలోకి చాలా బాగుంటుంది.  ఈ చట్నీ ఎర్రకారం బదులు పచ్చిమిరపకాయలు వేసి కూడా చెయ్యచ్చు.

Sunday, May 25, 2014

అటుకుల ఉప్మా (పోహా )

అటుకుల ఉప్మా ఆరోగ్యానికి మంచిది..బొంబాయి రవ్వ ఉప్మా కి ఆయిల్/ నెయ్యి ఎక్కువగా ఉపయోగించాలి. పైగా అది ఎక్కువ శుద్ధి చేసినది (రిఫైండ్ )అవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు..అటుకులు (మరీ తెల్లగా ,పల్చగా వున్నవి కాకుండా దొడ్డు అటుకులు వాడాలి )ధాన్యం నుండి తయారు అవుతాయి..అందులోని ముడిబియ్యం వల్ల విటమిన్లను కోల్పోదు. త్వరగా పూర్తి అయ్యే వంట. రుచికరం కూడా..ఉపవాసాల్లో కూడా వాడుకోతగ్గ , ఉపాహారం ఇది.
కావలసిన పదార్ధాలు :
1.అటుకులు 200 గ్రా., 2.అల్లంముక్కలు, 3.పచ్చిమిర్చి ముక్కలు ,4.కరివేపాకు,కొత్తిమిర , 5.జీడిపప్పు/పల్లీలు  , 6. పోపుదినుసులు, 7.కారట్+బీన్స్+ ఆలూ +పచ్చిబటానీ+ఉల్లితరుగు (ఇవి కావాలనుకొంటే వేసుకోవచ్చు ), 9 .పల్లీలు + పుట్నాల పొడి 2 sp., 10. ఆయిల్.
చేయువిధానం : ముందుగా అటుకులు శుభ్రం చేసుకొని, 2 సార్లు కడిగి , నీరు వంచి ,పెట్టుకోవాలి.పాన్ వేడి చేసి ,నూనె వేసి పోపుదినుసులు (శనగపప్పు+ మినపప్పు+ ఆవాలు+ జీలకర్ర ) వేసి ,వేగినతరువాత జీడిపప్పు /పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. అల్లం ,పచ్చిమిర్చి ముక్కలూ వేసి కొద్దిగా వేగిన తరువాత కూరగాయ ముక్కలు కూడా వేసి ,కొంచం సేపు మగ్గనివ్వాలి.తరవాత ఉప్పు + పసుపు వేసి, అటుకులు కూడా కలపాలి.బాగా కలిపి ,కొంచం ముద్దగా కావాలనుకొంటే పావు కప్పు నీరు కలుపుకోవచ్చు..లేదా పొడిపొడిగా కావాలనుకుంటే అలాగే వుంచి ఇష్టమైతే 2 sp పల్లీలపొడి ,2 sp . నిమ్మరసం వేసుకొని కొత్తిమిర జల్లితే వేడి వేడి అతుకుల ఉప్మా రెడీ..అన్నీ రెడీగా వుంటే 6 ,7 నిముషాలకన్నా ఎక్కువ సమయం పట్టదు మరి..:)

బట్టర్ నాన్

కావలసిన పదార్ధాలు : మైదా 2 కప్పులు ; వెన్న 100 గ్రా.; ఈస్ట్ 1 sp ,
పంచదార 1 sp ; ఉప్పు 1 sp ;బేకింగ్ సోడా 1 sp ; ఆయిల్ 2 tsp;
పెరుగు 2 tsp ; వేడినీళ్ళు 1 కప్పు.
ఇక్కడ sp అంటే చిన్న స్పూన్.tsp అంటే పెద్ద స్పూన్ అని అర్ధం చేసుకోండి .
చేయువిధానం : ఒక చిన్న బౌల్ లో వేడినీరు ,ఈస్ట్ ,పంచదార తీసుకొని బాగాకలపాలి . మరో పెద్ద బౌల్ లో మైదా ,ఉప్పు ,బేకింగ్ సోడా , ఆయిల్ వేసి బాగాకలిపి, దానికి పెరుగు కూడా కలిపి ,తరువాత ఈస్ట్ కలిపిన వేడినీళ్ళు పోసి బాగాకలపాలి.మరీ గట్టిగా కాకుండా , మృదువుగా ఉండేలా చూడాలి. ఆ బౌల్ మీదఒక తడి బట్ట వేసి 4 గంటలు పక్కన ఉంచాలి.పిండి బాగా ఉబ్బి, డబుల్ అవుతుంది.మళ్ళీ పిండిని బాగా కలిపి 6 / 7 సమాన భాగాలుగా చేసుకోవాలి .కొంచంపెద్దగానే చేసుకోవాలి ఉండలు. ఇప్పుడు పొడిమైదా పిండితీసుకొని , పీటమీదచల్లుకొని ,మైదా ముద్దను పెట్టి పొడుగ్గా వత్తుకోవాలి.చేతులకు ,పీటకు ,కర్రకు కొద్దిగా ఆయిల్ రాసుకొంటే అంటుకోకుండా వుంటుంది. చపాతీకిబట్టర్ రాసి మధ్యకు మడవాలి.మళ్ళీ వత్తి , మళ్ళీ బట్టర్ రాసి త్రిభుజాకారం ,లేదా ఓవల్ షేప్..మీకు నచ్చే ఆకారానికి మడిచి మందంగా వత్తుకోవాలిమందపాటి ఇనుప పెనం(హాండిల్ తో వున్నది ) వీటికి బావుంటుంది.పెనం వేడిఅయ్యాక నాన్ కి ఒకవైపు నీటి తడి రాసి ,తడిగా వున్నవైపు పెనం మీదవెయ్యాలి.ఇలాచెయ్యడం వల్ల ,నాన్ పెనానికి అతుక్కొని వుంటుంది. చేత్తో కూడాపైపైన వత్తి ,పెనం తో సహా తిరగేసి ,మంట రోటీకి తగిలేలాగా కాల్చాలి.చక్కగాపొంగుతుంది. మాడకుండా చూసుకోవాలి.ఇది కష్టం అనుకుంటే మార్కెట్లో పుల్కాలు కాల్చుకొనే గ్రిల్ దొరుకుతుంది . దానిమీద రెండు వైపులాకాల్చుకోవాలి . బట్టర్ కొద్దిగా కరిగించి , బ్రష్ తో గానీ ,స్పూన్ తో గానీ నాన్ కిరెండు వైపులా రాసి ,వేడిగా సర్వ్ చేయాలి.

Friday, May 9, 2014

మాగాయ పప్పు

మాగాయ పప్పు : కుక్కర్ లో కందిపప్పు పెట్టాలి. పప్పు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి, అందులో కాస్త మాగాయ పచ్చడి వేసి, పప్పు వేసి కలిపెయ్యాలి. ఇది మామిడికాయ పప్పు లాగా ఉంటుందండోయ్…

కారట్ హల్వా

కారట్ హల్వా అందరికీ తెలిసిందే . మంచి కారట్స్ అంటే మంచి రంగులో ,లావుగావుండాలి అప్పుడే జ్యూసీ గా వుంటాయి .అలాంటి కారట్స్ తెచ్చుకొని ,తురుముకొనిపెట్టు కోవాలి. ఒక బౌల్ కారట్ తురుముకి ,పావుకిలో చక్కర పడుతుంది . మిల్క్మెయిడ్ ,కోవా వాడితే చక్కర 100 గ్రా. సరిపోతుంది .
పాన్ వేడి చేసి 2 sp నెయ్యివేసి జీడి పప్పు ,కిస్ మిస్ వేయించాలి .
తరువాత మరి కాస్త నెయ్యి వేసి ,కారట్ తురుము వేయించాలి.కమ్మటి వాసనవచ్చేవరకు వేయించాలి. తరువాత 1 కప్పు పాలు పోసి ఉడికించాలి .కారట్ ఉడికినతరువాత ,పంచదార వేసి బాగా కలపాలి.మిల్క్ మెయిడ్/ కోవా , కూడా వేస్తే చాలారుచి. అవి లేకపోతే పంచదార తో చేసుకోవచ్చు. బాగా కలిపి కొంచం గట్ట్టిపడ్డాక ( మరీగట్టిగా చేయరాదు ) , జీడిపప్పు , కిస్మిస్ ,కొంచం వనిల్లా ఎసెన్స్ వేయాలి .అదిలేకపోతే యాలకులపొడి.కానీ వనిల్లా ఎసెన్స్ 2 చుక్కలు వేస్తే చాలా బావుంటుంది.# ఇదే పద్ధతిలో బీట్ రూట్ హల్వా కూడా చేయవచ్చు.

టమోటా బాత్

కావలసిన పదార్థాలు
ఒక గ్లాసు ఉప్మారవ్వ
పండిన టమోటాలు 3
ఉల్లిపాయ 1
అల్లం
పచ్చిమిర్చి, లేక ఒక స్పూను కారం
2 స్పూన్లు నెయ్యి
కరివేపాకు
కొత్తిమీర
MTR సాంబారు పొడి
నాలుగు బీన్సు (చిన్న ముక్కలు), లేక పచ్చి బటానీలు
జీడిపప్పు, శనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు

తయారు చేయు విధానము
బాణలిలో నూనె వేసి పోపుగింజలు వేగాక కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి వేగాక నీళ్ళు పోయాలి. నీళ్ళు బాగా మరిగాక, తగినంత ఉప్పు వేసి, MTR సాంబారు పొడి 3 స్పూనులు వేసి, తరవాత బొంబాయి రవ్వ మెల్లగా పోస్తూ కలియపెట్టాలి. మూత పెట్టి కాసేపయాక, నెయ్యి, కొత్తిమీర జల్లి కలియపెట్టాలి. ఇలా చేసి చూడండి. చాలా రుచిగా వుంటుంది.
ముఖ్య గమనిక
టమోటాబాత్ కి MTR సాంబారుపొడి, పోపులో జీలకర్ర వేస్తేనే రుచిగా వుంటుంది. నూనె పల్లీనూనె ఐతేనే రుచిగా వుంటింది. నూనె కూడా సరిపడా వెయ్యాలి. లేకపోతే ఉప్మా ఉండలు కడ్తుంది. ప్లేటులో పెట్టేటప్పుడు పులుసు గరిటతో నొక్కి వేస్తే ఇడ్లీ షేపు వస్తుంది. ఈ టమోటాబాత్ ఓట్సుతో కూడా చెయ్యచ్చు.

Sunday, May 4, 2014

వంటింటి చిట్కాలు

కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వొస్తుంది.
ఫ్లాస్క్ ని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగ తో కడిగితే సరి.
బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి.
ఆమ్లెట్ కు అదనపు రుచి రావాలంటే సోనకు కొబ్బరి కోరు జోడించాలి.
సూప్ ను పొయ్యి మీద నించి దించాక రెండు చెంచాల పాల మీగడ కలిపితే చిక్కదనంతో పాటు అదనపు రుచి తోడు అవుతుంది.
తరిగిన బంగాళ దుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వినేగార్ చల్లితే చాలు.
తేనె సీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు చేరవ్.
అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజా గా ఉంటుంది.
బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.
వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది.
నిలవ పచల్లకు ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
కాలిఫ్లోవేర్, పాలకూర వంటి వాటిని శుబ్రం చేయటానికి నీటిలో కొద్దిగా వినేగార్ కలపండి.
కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.
గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కాస్త ఉప్పు వేస్తే అవి పగిలిపోకుండా ఉంటాయి.
కిలో గోధుమలలో గుప్పెడు సనగలు చేర్చి మరపట్టిస్తే చపాతీలు తెల్లగా మరియు రుచిగా ఉంటాయి.
బత్తాయి రసం తీసాక గింజలను వేరుచేసాక మిగిలిన గుజ్జులో పంచదార కలుపుకొని తింటే రుచికరంగా ఉంటుంది, చక్కటి పోషకాలు అందుతాయి.
అరటిపండు పువ్వులను fridge లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన మారిపోతుంది.
పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే సరి.
రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే సుబ్రపడుతుంది.
snack వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది.
పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
బియ్యం, తృణ ధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేఖలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.
గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బునీళ్ళలో వినేగార్ కలిపి రుద్దితే పోతాయి.
వాడేసిన నిమ్మచేక్కలతో లంచ్ boxes ని రుద్దితే వాసన రాకుండా ఉంటాయి.
ఇత్తడి రాగి పాత్రలను మగ్గిన అరటిపండు గుజ్జుతో తోమితే కోత్తవాటిలా మెరుస్తాయి.
నిమ్మరసం లో ఉప్పు కలిపి వంట గది గట్టుని రుద్దితే జిడ్డు పోతుంది.
పులుసు కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి.
కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.
కోసిన ఉల్లిపాయలు సగమే వాడినప్పుడు పాడవటం పదేయ్యటం జరుగుతోందా? అయితే వాడగా మిగిలినదానికి కాస్త వెన్న రాసి చూడండి, తాజాగా ఉంటుంది.
కప్ అడుగు బాగంలో టీ మరకలు ఎండిపోతే కాస్త ఉప్పు చల్లి నీళ్ళు పోసి నానా పెడితే అవి సులువుగా వదిలిపోతాయి.
బెండకాయ, వంకాయ వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనె లో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.
cooker అడుగుబాగం నల్లగా మారితే అందులో గ్లాస్ నీళ్ళు పోసి కాగితం పరిస్తే మరునాడుకి తెల్లబడుతుంది.
గుడ్డులోని పచ్చ సొన వంట గది గట్టు మీద పడితే ఆ ప్రాంతంలో ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మారక ఆనవాళ్ళు ఉండవు.
దోసల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
వేడిచేసిన గరిటతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా తాజాగా ఉంటుంది.
బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టదు.
పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి వేస్తే సరిపోతుంది.
పిండిలో పావు కప్పు వేయించిన సేమియా వేస్తే, గారెలు మరింత రుచిగా ఉంటాయి.
అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.
ఇడ్లీ దోస పిండి మరునాటికి పులవకుండా ఉండాలంటే, గిన్నె మీద తడి వస్త్రం కప్పాలి లేదా సోడా ఉప్పు వెయ్యాలి.
మజ్జిగ పలచన అయితే పది కరివేపాకు రెబ్బలు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కపడతాయి.
వెన్న కాచేటప్పుడు నెయ్యి తాజా గా ఉండి మంచి వాసన వస్తు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే గిన్నెలో ఒక తాజా తమలపాకు వేసి కాచితే సరి.
పుదినా కొత్తిమీర చెట్నీ చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
వెల్లుల్లిని fridge లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి, పోట్టుకూడా సులువుగా వస్తుంది.
కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, decoction లో చిటికెడు ఉప్పు వేసి చూడండి.
పావుగంట పాటు వేడి నీళ్ళలో నాన పెడితే బాదం పొట్టు సులువుగా వస్తుంది.
ఆపిల్ ముక్కల మీద నిమ్మ రసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
క్యాబేజీ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.
కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.
మరీ జిడ్డు పేరుకుపోయిన పాత్రలను తోమడానికి ఉప్పులో ముంచిన నిమ్మ చెక్కలతో తోమి పాత పత్రికలతో రుద్దితే సరి.
ఒకసారి వేసిన వడ లని మళ్ళి వేయిస్తుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి, దీన్ని నివారించేందుకు వడ లని ఒక నిమిషం మాత్రమె వేయించండి. ఆ వెంటనే tissue కాగితంపై ఉంచండి. అధిక నూనె సమస్య ఉండదు, వడలు కరకరలాడతాయి.
ఆకు కూరలు ఉడికించిన నీటిని వృధాగా పారెయ్యకుండా soup ల తయారీలో వాడుకోవచు.
ఫ్లాస్కులని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి.
బొంబాయి రవతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
కూరల్లో పులుసులో ఉప్పు కారం ఎక్కువయ్యినప్పుడు రెండు చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరిపోతుంది.
మరీ నిల్వ ఉంచిన సెనగపిండిని పారవేయ్యకుండా స్టీలు గిన్నెలు వెండి సామాన్లను తోమితే చక్కగా సుబ్రపడతాయి.
వొంట గదిలో చీమలు బారులు తీరాయా? అయితే అవి ఉన్న చోట నిమ్మరసం చల్లండి.
పాలలో మీగడ ఎక్కువగా రావాలంటే కాచడానికి ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.
అరటి, బంగాళ దుంప ముక్కల మీద ఉప్పు నీళ్ళు చల్లి పావుగంట అయ్యాక వేపుడు చేస్తే ముక్కలు బాగా వేగుతాయి.
వెల్లుల్లి రెబ్బల్ని గంటపాటు నీళ్ళల్లో నాన పెట్టి పొట్టు తీస్తే సులువుగా వస్తాయి.
ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.
గుడ్లను ఉడికించే నీళ్ళల్లో రెండు చెంచాల వినెగర్ కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
పిండి వంటలు చేసేటప్పుడు బాణలిలో నూనె పొంగాకుండా ఉండాలంటే, మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
సగానికి కోసిన ఆపిల్ ముక్కలు నల్లగా రంగు మారకుండా ఉండాలంటే, తెల్లని బాగంలో ఉప్పు రాయాలి.
మిగిలిపోయిన బ్రెడ్ను కాసేపు ఓవెన్ లో ఉంచి పొడి చేసి పులుసులో వేసుకుంటే రుచిగా ఉంటుంది.

పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వెన్న కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
పచ్చి కొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం పూస్తూ ఉంటె వారం వరకు తాజాగా ఉంటాయి.
ఇంగువ గడ్డ కడితే, ఆ డబ్బాలో నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తే పొడిగా అవుతుంది.
టమాటాలు వండటానికి ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటకాలు రుచిగా ఉంటాయి.
కోడిగుడ్డు పెంకులను కిటికీలు ventilators వద్ద పెడితే, క్రిమి కీటకాలు చేరవు.
cauliflower తో వంటలు చేసేటప్పుడు అందులో కాసిని పాలు కలిపితే, వంట మరింత రుచిగా ఉంటుంది.
కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.

పుదినా కొత్తిమీర చట్ని రంగు మారకుండా ఉండాలంటే చేసిన వెంటనే నిమ్మరసం పిండితే సరిపోతుంది.
పెసర పిండిలో నిమ్మరసం కలిపి వెండి సామాగ్రిని రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
పచ్చిమిర్చిని కొసాక పంచదార కలిపిన చల్లటి నీళ్ళతో చేతుల్ని కడిగితే మంటగా ఉండదు.
ఆకు కూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే కూర సహజ రంగుని కోల్పోదు.
బంగాల దుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.
వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి.
గుడ్డులోని సొనకు పాలు కాస్త పంచదార కాస్త కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
కందముక్కలను ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే, అవి త్వరగా ఉడుకుతాయి.
ఇంట్లో చేసుకునే తమటా సూప్కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్రూట్ ముక్క వేస్తే, రంగు పోషకాలు రెండు అందుతాయి.
వంటకాలు తక్కువగా పీల్చుకోవాలంటే అందులో అరచెంచా వెనిగర్ని కలిపి చూడండి.
కాచిన నెయ్యిలో నాలుగు మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది.
పచ్చి మిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయిన్చేతప్పుడు పేలకుండా ఉంటాయి.

బియ్యం నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేస్తే పురుగులు పట్టవు.
అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యం లేదా సెనగపప్పు వేస్తే మెత్త బడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలను వేస్తే, మంచి వాసన వస్తుంది.

పాలకూర పకోడీలు

పాలకూర పకోడీలు కరకర లాడుతూ మంచి రుచిగావుంటాయి. ఇవి శనగపిండి తో చేసే ఉల్లిపాయ పకోడీల్లా, ఎక్కువ నూనె పీల్చవు. పైగా ఎక్కువ ఆకుకూర..అందునా పాలకూర..పిల్లలకి మంచి స్నాక్ అవుతుంది. స్కూల్ నుండి రాగానే ,ఇంట్లో చేసిన పదార్ధాలనే ఇస్తే,ఆరోగ్యం కూడా.ఇందుకు కావలసిన పదార్ధాలు ..
కావలసిన పదార్ధాలు :
1.శుభ్రంచేసి,కడిగి,తరిగిన పాలకూర 5 కట్టలు,
2. శనగపిండి 2 కప్పులు ,
3. బియ్యప్పిండి పావు కప్పు,
4. అల్లవేల్లుల్లి పేస్ట్ 1 sp.,
5.ఉప్పు+కారం తగినంత,
6. కొత్తిమిర తరుగు 1 కట్ట,
7.పచ్చిమిర్చి 3 సన్నగాతరిగి,
8. జీలకర్ర పొడి 1 sp,
9 . వేయించడానికి నూనె తగినంత .
చేయువిధానము : ఒక వెడల్పైన పాత్రలో శనగపిండి + పాలకూర తరుగు + బియ్యప్పిండి + అల్లం వెల్లుల్లి పేస్ట్ + జీరా పొడి+ఉప్పు+కారం +కొత్తిమీర + పచ్చిమిర్చి తరుగు వేసి అందులో కాచిననూనే ఒక పెద్ద చెంచాడుపోసి బాగా కలిపి,కొద్దిగా నీరుచల్లి (జాగ్రత్త గా కలపాలి ,ఎక్కువ నీరు పట్టదు .)గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రై పాన్ పెట్టి ,నూనె పోసి వేడి చేయాలి.నూనె వేడెక్కాక.. చేతిలోకి పెద్ద పిండి ముద్ద తీసుకొని ,పకోడీల్లా నూనెలో వేయాలి..మీడియం ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ..పైన ఇష్టమైతే కొంచం ఛాట్ మసాలా చల్లుకొంటే ..వేడి వేడి పాలక్ పకోడీలు సిద్ధం.ప్రయత్నిస్తారు  కదూ..  :)

Friday, May 2, 2014

టమాట పెరుగు పచ్చడి


ఇది కూడా సులువుగా అయే ఐటం
కావలసినవి -
టమాటాలు-2,
పెరుగు -1 కప్పు,
పచ్చిమిర్చి-2,
పోపుకి- ఎండు మిర్చి-1,శెనగ పప్పు,ఆవాలు,జీలకర్ర,వాము,
పచ్చిమిర్చి,అల్లం,కర్వెపాకు,కొత్తిమీర .
______________
తయారీ విధానం-
ముందు టమాటా కడిగి ముక్కలు చేసి, కొద్దిగా నీరు పోసికాస్త ఉప్పు వేసి స్టవ్ పై ఉడికించి,చల్లార్చి,ఉంచుకోవాలి.

పెరుగు చిలికి-కాస్త ఉప్పేసి ఉంచుకుని,అందులో పోపు వెయ్యాలి.
పోపు -మూకుట్లో నూనె వేసి,వేడయ్యాక- ఆవాలు,శెనగ పప్పు,జీలకర్ర,వాము, వేసి,వేగాక
పచ్చిమిర్చి,అల్లం,వేసి స్టవ్ ఆపేసి, కర్వెపాకు కూడా వేసి,పెరుగు లో కలపాలి.
ఇప్పుడు చల్ల్లారిన టమాటా గుజ్జగా చేసి, కలిపెయ్యాలి.
కొత్తిమీర చల్లుకోవాలి.
పెసరకట్టు : అన్నం కుక్కర్ లోనే కాస్తంత పెసరపప్పు నీళ్ళు పోసి పెట్టాలి. కుక్కర్ మూత రాగానే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు పోపు వేసి, ఉప్పు కలిపేస్తే సరిపోతుంది. మంచి చలవ చేసే పెసరకట్టుకు సరైన కాంబినేషన్ 'మెంతికాయ, మాగాయ, లేక ఆవకాయ...'.
మాగాయ పప్పు : కుక్కర్ లో కందిపప్పు పెట్టాలి. పప్పు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి, అందులో కాస్త మాగాయ పచ్చడి వేసి, పప్పు వేసి కలిపెయ్యాలి. ఇది మామిడికాయ పప్పు లాగా ఉంటుందండోయ్...
కారెట్ కూర : కారెట్ సాధారణంగా ఉడకడానికి సమయం తీసుకుంటుంది. అయితే, కారెట్ తురిమి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, రెండు ఎండు మిర్చి, కర్వేపాకు వేసిన పోపులో వేసి, చివరగా ఉప్పు కలిపి, తీసేస్తే ఆ రుచి అద్భుతః. ఈ కూరకు ఐదు నిముషాల కంటే ఎక్కువ సేపు పట్టదోచ్... ప్రయత్నించండి...

వెజిటబుల్ కిచిడి

 

అన్ని వయసులవారికీ ఆరోగ్యకరంగా ,రుచిగా వుంది త్వరగా జీర్ణమయ్యే ఆహారంకిచిడీ..ఇది పసివారి నుండీ వృద్ధుల వరకూ చక్కని పోషకాహారం..త్వరగాచేసుకోగలం. దీనికి కావలసిన పదార్ధాలు..
కావలసిన పదార్ధాలు : 1. బియ్యం 1 గ్లాసు, కంది/పెసర పప్పు 1/2 గ్లాసు, సోయానగ్గెట్స్ / చిప్స్ 1/4 కప్పు , ఆలూ + బీన్స్+ పచ్చి బఠానీలు + కాలీఫ్లవర్ + కారట్+పచ్చిమిర్చి (3),+ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి 3 కప్పులు., పసుపుఉప్పు,నూనె, పోపు దినుసులు, మిరియాలు, నెయ్యి .,కరివేపాకు ,కొత్తిమిర.
తయారు చేయు విధానము : ముందుగా బియ్యము + పప్పు కడిగి కాసిని
నీళ్ళుపోసి పెట్టుకోవాలి. కుక్కర్ వేడి చేసి కొద్దిగా నూనె + నెయ్యి వేసి
పోపుదినుసులు + జీలకర్ర + మిరియాలు,కరివేపాకు వేసుకోవాలి తరవాత
కూరగాయ ముక్కలూ ,సోయా నగ్గెట్స్ వేసుకొని పసుపు వేయాలి..కాసేపు కలిపికడిగి ఉంచుకున్న బియ్యం పప్పు వేసుకోవాలి. అన్నీ మరోసారి కలిపి ,తగినంతఉప్పు వేసుకొని , 2 గ్లాసుల నీల్లుపోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్రానివ్వాలి.. వెయిట్ వచ్చాక మూతతీసి మరి కాస్త నెయ్యి, కొత్తిమిర చల్లుకొంటేఘుమ ఘుమ లాడే కిచిడీ సిద్ధం..

Wednesday, April 16, 2014

అరటి ఉండలు

కావలసిన పదార్థాలు :
అరటి పండు గుజ్జు   -         రెండు కప్పులు
కొబ్బరి తురుము    -         రెండు కప్పులు
చక్కెర                  -         రెండు కప్పులు
పాలు                   -          రెండు కప్పులు
యాలకుల పొడి      -          అర చెంచ
కేసరి రంగు            -          చిటికెడు
నెయ్యి                  -           అరకప్పు

తయారుచేసే పద్ధతి :
కొబ్బరి తురుములో పాలు పోసుకుంటూ బాగా మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకొని చక్కెర, అరటి పండు గుజ్జు కలపాలి. దీన్నంతా మరో వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని సన్నటి మంటపై పెట్టాలి. కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటే కాసేపటికి మిశ్రమం అంతా దగ్గరపడుతుంది. అందులో యాలకుల పొడి కూడా వేసి ఓ సారి కలిపి దింపేయాలి. వేడి చల్లారాక ఉండల్లా చుట్టుకుంటే సరిపోతుంది.

Monday, March 24, 2014

మొక్కజొన్న బోండా

 
కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు : కప్పు (ఉడకబెట్టినవి),
బంగాళా దుంప : కప్పు (ఉడకబెట్టినది),
అల్లం : చిన్న ముక్క,
పచ్చిమిర్చి : 2, కొత్తిమీర :
కట్ట, ఉప్పు : తగినంత,
శనగపిండి : 2 కప్పులు,
జీలకర్ర : చిటికెడు,
నూనె : వేయించడానికి సరిపడ.

తయారుచేసే పద్ధతి :
అల్లం, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన మొక్కజొన్నల గింజలను మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకోవాలి. దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. శనగపిండిలో ఉప్పు వేసి బజ్జీల పిండిలా తయారు చేసుకోవాలి. ఉండలను శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేయించుకోవాలి. వాహ్..మొక్కజొన్న బొండా తయార్..

కొబ్బరి పొంగడాలు

 
కావలసినవి
కొబ్బరికోరు-రెండు కప్పులు,
తడిబియ్యం పిండి-రెండున్నర కప్పులు
బెల్లం, పంచదార-కప్పు చొప్పున,
యాలకులు-ఆరు
నూనె-పావుకిలో,
జీడిపప్పు-పావు కప్పు,
నెయ్యి-నాలుగు చెంచాలు
పెరుగు-కప్పు

తయారుచేసే విధానం
  • బెల్లానికి నీరు చేర్చి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి.
  • అందులో కొబ్బరికోరు, పంచదార, బియ్యం పిండి చేర్చి బాగా కలియతిప్పాలి.
  • పదార్థం బాగా దగ్గర పడ్డాక నెయ్యి చేర్చి మూతపెట్టాలి. తరువాత పెరుగు వేసి గరిటె జారుగా కలిపి దించేయాలి.
  • ఇప్పుడు పెనం వేడి చేసి అరచెంచా నెయ్యి రాసి ఈ పిండిని చిన్నచిన్న అట్లులా వేయాలి. రెండువైపులా కాల్చితే...చాలా రుచిగా ఉంటుంది. లేదంటే...నూనెలో కూడా వేయించుకోవచ్చు.
  • అయితే ఈ పిండిని గుంట గరిటెతో తీసుకుని నూనెలో వేయాలి. వేగాక ఇది రెండు పొరలుగా విడిపోతుంది.

గుత్తి పొట్లకాయ కూర


  కావలసిన పదార్థాలు :

పొట్లకాయ            -            1
బంగాళదుంప       -             1 (ఉడికించి పెట్టుకోవాలి)
ఉల్లి తరుగు         -              ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు -             1 టీస్పూన్
కొత్తిమీర తరుగు   -                అరకప్పు
నిమ్మరసం           -              ఒక టీస్పూన్
ఉప్పు                 -              తగినంత
నూనె                 -              వేయించడానికి సరిపడా
రవ్వ                  -              3 టేబుల్ స్పూన్లు

తయారుచేసే పద్ధతి :

              పొట్లకాయను ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్ చేసి, లోపలి గుజ్జు, గింజలు తీసేయాలి. ఒక పాత్రలో చిదిమిన ఆలు, ఉల్లి, మిర్చి, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు కలిపి ముక్కల్లో నింపాలి. కూర కనిపించే భాగాల్ని రవ్వలొ అద్ది సన్నని మంటపై నూనెలో దోరగా వేయించాలి. (ఇష్టమైతే ఆలు మిశ్రమానికి బదులు శనగ పిండి, పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, పంచదార, చింతపండు గుజ్జుల మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకొని పొట్ల గొట్టాల్లో పూడ్చవచ్చును)

బీరకాయ పల్లీ మసాలా

  కావలసినవి:
బీరకాయ (పెద్దది) - ఒకటి,
ఉల్లిపాయ (పెద్దది, తరిగి) - ఒకటి,
వేగించిన పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు,
ఎండుమిర్చి - ఐదు,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - ఒక టేబుల్ స్పూన్.
తాలింపుకు:
నువ్వుల నూనె - ఒక టేబుల్ స్పూన్,
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ - ఒక్కో టీస్పూన్.

తయారీ:
బీరకాయ చెక్కు తీసేసి సన్నగా తరగాలి. వేగించిన పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు వేయాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరువాత తరిగిన బీరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. (నీళ్లు పోయొద్దు. ఉడికేటప్పుడు బీరకాయ ముక్కల నుంచి నీరు వస్తుంది.) చివరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి కలిపి కొన్ని నిమిషాల తరువాత స్టవ్ పైనుంచి గిన్నె దింపేయాలి. ఈ కూరని వేడివేడిగా అన్నం, రోటీ, పరాఠాల్లో తింటే బాగుంటుంది.

Saturday, March 22, 2014

కాకరకాయ వేపుడు

కావలసిన దినుసులు:
కాకారకాయలు – 4 (మీడియమ్ సైజు)
వెళ్ళుళి రెబ్బలు - 6
పచ్చిసెనగ పప్పు – 1 స్పూన్
మినపగుళ్ళు – 1 స్పూన్
ఎండు మిర్చి - 3
కర్వెపాకు – 2 రెండు రెమ్మలు
ఆవాలు – 1 స్పూన్

జీలకర్ర -1 స్పూన్
కారం - 2 స్పూన్స్
పసుపు - 1 టీ స్పూన్
నూనె – 3 స్పూన్స్
తయారుచేయువిధానం:
ముందుగ కాకరకాయలను శుభ్రంగా కడిగి, గుండగా తరిగి పెట్టుకోవాలి (గుండగా తరిగటానికి వేజటెబుల్ కట్టర్ను వాడాలి).
ఒక కడాయిలొ నూనె పోసి అది వేడెక్కిన తరవాత అందులొ ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగపప్పు, మినపగుళ్ళు, ఎండుమిర్చి, కర్వెపాకు, వెళ్ళుళి రెబ్బలు వేసి వేయుంచుకోవాలి. అవి వేగిన తరవాత గుండగా తరగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి మూత పెట్టకుండ ఇరవై నిమషాలు వేయుంచుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చెవరకు వేయించి దించే ముందు పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే!  ఏంతో కమ్మగ కర కర లాడే కాకరకాయ వేపుడు రెడీ.

ఇడ్లీ పిండి బోండాలు

కాలవసిన దినుసులు:
ఇడ్లీ పిండి – రెండు కప్పులు
ఉప్పు – 1 టేబుల్ స్పూన్
ఉల్లి పాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం:
ముందుగా  ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర తరిగి, ఇడ్లీ పిండిలొ కలుపుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపి ప్రక్కన పెట్టు కోవాలి. కడాయి పొయ్యి మీద పెట్టి, నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా మరిగినప్పుడు, ఇడ్లీ పిండిని చేతితొ గుండ్రంగా చేసి,  నూనెలొ వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ బోండాలు పల్లి పచ్చడితొ తింటే చాల రుచిగా వుంటాయి. అంతే! ఎంతో రుచిగ వుండే ఇడ్లీ పిండి బోండాలు రెడీ. 

ఆలుగడ్డ పిట్టు

ఆలుగడ్డ(బంగాళదుంప)  ఆరోగ్యానికి చాల మంచిది. మంచి పోషకవిలున్నాయి. వాతవ వున్నావారు, షుగర్ వున్నావారు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఆలుగడ్డ పిట్టు చాల తోందరగా అయిపోతుంది. పూరితో ఆలుగడ్డ పిట్టు తింటే చాల బావుంటుంది.
కావలసిన దినుసులు:
ఆలుగడ్డ – 500 గ్రాములు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిరపకాయలు – ఆరు
కారం – టీ స్పూన్
కొత్తిమీర – చిన్న స్పూన్
నూనే – రెండు స్పూన్స్
పసుపు – చిటికెడు
పోపు దినుసులు:
ఆవాలు – టేబుల్ స్పూన్
జీలకర్ర -  టేబుల్ స్పూన్
పచ్చిశెనగపప్పు -  టేబుల్ స్పూన్
మినప గుళ్ళు – టేబుల్ స్పూన్
కరివేపాకు – కొంచెం
ఎండుమిర్చి – రెండు
తయారుచేయ విధానము:
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి ప్రక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డల పై పెచ్చు తీసి శుబ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. కుక్కర్,లో కొంచెం నీళ్ళు పోసి ఒక గిన్నెలో ఆలుగడ్డలను పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఆరు వీజిల్స్ వచ్చేవరకు పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తరవాత గుత్తితో ఆలుగడ్డలను  బాగా మెదిపి ప్రక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిని పోయ్యి మీద పెట్టి నూనె వేసి అది వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగపప్పు, మినపగుళ్ళు,  ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరవేపాకు వేసి బాగా వేగనివ్వాలి. పోపు వేగిన తరవాత, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తరవాత ఆలుగడ్డను వేసి బాగా కలిపి పసుపు, ఉప్పు, కారం వేసి నాలుగు వైపుల కలిపి రెండు నిమషాలు మూత పెట్టుకోవాలి. చివరిగా రుచి చూసి, కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే ఆలుగడ్డ పిట్టు రెడీ!

రైస్‌ స్ప్రింగ్‌రోల్‌



కావలసినవి అన్నం: కప్పు, మైదా: కప్పు, బియ్యప్పిండి: అరకప్పు, పసుపు: అరటీస్పూను, నిమ్మరసం: అరటీస్పూను, కొబ్బరిపొడి: అరకప్పు, ఉప్పు: సరిపడా, టొమాటోసాస్‌: 2 టేబుల్‌స్పూన్లు, చిజ్‌తురుము: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: అరటీస్పూను, ఆవాలు: అరటీస్పూను, నూనె: 2 టీస్పూన్లు, ఎండుమిర్చి: 2 
తయారుచేసే విధానం
* మైదా, బియ్యప్పిండి కలపాలి. అందులోనే ఉప్పు, మిరియాలపొడి వేసికలిపి తగినన్ని నీళ్లు పోసి కలిపి దోసెల్లా వేయాలి. * బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అన్నం, పసుపు, నిమ్మరసం, కొబ్బరిపొడి వేసి వేయించి దించాలి. ఇది చల్లారిన తరవాత దోసెలమీద చల్లి రోల్‌ చెయ్యాలి. ఇప్పుడు ఈ రోల్స్‌మీద సాస్‌వేసి చిజ్‌తురుము చల్లి మైక్రోవేవ్‌లో ఓ నిమిషం బేక్‌ చేసి తీయాలి.

Thursday, March 20, 2014

క్యారెట్ కూర

కావలసిన పదార్ధాలు :
క్యారెట్లు :మూడు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి :రెండు
కారం :అర టీ స్పూన్
పసుపు : చిటికెడు
నూనె :రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు :రెండు రెమ్మలు
ఉప్పు : సరిపడా
అల్లం ముక్కలు : టీ స్పూన్
పోపు దినుసులు : టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) క్యారెట్లు చెక్కి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేసి కాగాక - పోపుదినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. అవి వేగాక అల్లంముక్కలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి వేగాక, క్యారెట్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ఇలా చేస్తే క్యారెట్ ముక్కలు మెత్తబడతాయి.
3) చిన్నమంటమీద ఐదునిముషాలు ఉంచి మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆపాలి.