Monday, May 30, 2016

సర్వపిండి

బియ్యంపిండి-అరకేజీ
వేరుసెనగపప్పు-వందగ్రాములు
పచ్చిసెనగపప్పు-వందగ్రాములు
నువ్వులు-వందగ్రాములు
జీలకర్ర-ఒకటేబుల్స్పూన్
పచ్చిమిరపకాయలు-రెండు,చిన్నగాతరగాలి
ఉల్లిపాయలు-రెండు,సన్నగాతరిగినవి
కొత్తిమీర-ఒకకట్ట-చిన్నగాకట్చేసి పెట్టుకోవాలి
కరివేపాకు-అయిదురెమ్మలు,చిన్నగాకట్చేసిపెట్టుకోవాలి
నూనె-వేయించుకోడానికి సరిపడా
అల్లంవెల్లుల్లిపేస్టు-ఒకటేబుల్స్పూన్
కారం-ఒకటీస్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
గోరువెచ్చనినీరు-పిండితడుపుకోడానికితగినన్ని
స్టవ్వెలిగించికడాయి పెట్టివేడిచేయాలి.నువ్వులువేసిఅయిదు నిముషాలులోఫ్లమేలోవేయించాలి.బాగావేగినతరువాతవాటిని తీసిఒకగిన్నెలోకితీసుకోవాలి.అదేకడాయిలోవేరుసెనగగుండ్లువేసిలోఫ్లేమ్లోఅయిదు
లేకఆరునిముషాలువేయించాలివీటినిఒకప్లేట్లోకితీసుకోవాలి.చల్లారినతరువాతచేత్తో
మెత్తగానలగ్గోట్టుకోవాలి.అప్పుడుఅవిరెండుగావిడిపోతాయి.
ఒకగిన్నెలోనీళ్ళుపోసివేరుసేనగాపప్పును,పచ్చిసెనగపప్పునుపదినిముషాలు
వేరువేరుగానానబెట్టుకోవాలి.
ఒకగిన్నెలోబియ్యంపిండితీసుకోవాలి.అందులోసన్నగాతరిగిన ఉల్లిపాయలు,
కొత్తిమీర,పచ్చిమిర్చి,కరివేపాకువేసుకోవాలి.వీటితోపాటుజీలకర్రవేసుకోవాలి
వేయించుకున్ననువ్వులువేసుకోవాలి.నానబెట్టినపచ్చిసెనగపప్పువేసుకోవాలి
నీటిలోనానబెట్టినవేరుసేనగాగుండ్లు వేయాలి.తర్వాతకారం,ఉప్పువేసుకోవాలి.
పిండిలోబాగాఇవిఅన్నికలిసేలా కలుపుకోవాలి.అందులోగోరువేహ్హనినీళ్ళుపోసుకుంటూ చపాతీపిండిలకలుపుకోవాలి.అందులోఅల్లంవెల్లుల్లిపేస్టువేసుకోవాలి.పిండినిబాగా
కలుపుకునిపెట్టుకోవాలి.నాన్ స్టిక్కడాయితీసుకునిండులోనూనెకొద్దిగావేసిమొత్తంకడాయిఅంతపూసుకోవాలి
తయారుచేసుకున్నపిండినికొంచెంతీసుకునికడాయిమద్యలోపెట్టిచేతికినూనెతడి చేసుకుని పలుచని రొట్టెల కడాయిఅంతవచేట్టు చేసుకోవాలి.సర్వపిండి కి
అక్కడక్కడ చిన్నరంధ్రాలుపెట్టుకోవాలిఎందుకంటెనూనెకిందికిదిగికాలుతుందికాబట్టి
స్టవ్వెలిగించిమనంచేసుకున్నసర్వపిండికడాయిపెట్టుకోవాలి.కాస్తవేడిఅయ్యాకసర్వపిండిమునిగేవరకుఅరకప్పునూనెపోసుకోవాలిహైఫ్లేమ్ లోపెట్టిబంగారు
గోధుమ రంగులోకివచ్చేంతవరకువేయించాలి.highflame లోపెట్టటంవల్ల
ఎక్కువనూనెపీల్చాడుఇలాబంగారు రంగులోకివచ్చాకఒకప్లేట్లోకితీసుకోవాలి

Friday, May 27, 2016

అల్లం పచ్చడి

అల్లం పచ్చడి
ఎండు మిరపకాయలు -పది
ఆవాలు -ఒక స్పూన్
వెల్లుల్లి -మూడు రెబ్బలు
చింతపండు -చిన్న నిమ్మకాయ సైజు 
అల్లం-యాభయి గ్రాములుబెల్లం -యాభయి గ్రాములు
మినపప్పు -రెండు స్పూన్స్
ముందుగ ఎండుమిరపకాయలను చిన్నగా చేసుకోవాలి.
అల్లం ను చిన్న ముక్కలుగా చేసుకోవాలి .బెల్లంనుకూడా చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి .చింతపండును రెండు నిమిషాలపాటు నీటిలో వేడి చేయాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి రెండు స్పూన్స్ నూనె వేసి కాగాక ఒక స్పూన్ ఆవాలు
ముందుగ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి .తర్వాత మినపప్పు వేసుకోవాలి .ఎండు మిర్చిని వేసుకోవాలి.ఇవన్ని బాగా కలిసేలా కలపాలి ఇవి చల్లారిన తరువాత మిక్షి జర్లోకి తీసుకుని అల్లం ముక్కలు,బెల్లంముక్కలువడగట్టినచింతపండువేసుకోవాలి.అందులోఉప్పుతగినంతవేసుకోవాలి.మెత్తగపొడిఅయినతర్వాతకొంచెంనీరుచేర్చిమరలమిక్షిపట్టండి

Thursday, May 26, 2016

చనా పరాటా

గోధుమపిండి-ఒకటిన్నరకప్పు
నూనె-మూడుటేబుల్స్పూన్స్
ఉప్పు-రుచికిసరిపడా
నాన బెట్టినతెల్లశనగలు-ఒకకప్పు
ఉల్లిపాయముక్కలు-అరకప్పు
పచ్చిమిర్చి-నాలుగు
అల్లంతరుగు-పావుటీస్పూన్
కొత్తిమీర,కరివేపాకుతరుగు-అరటీస్పూన్
కారం-అరటీస్పూన్
గరంమసాలఅరటీస్పూన్
పసుపు-చిటికెడు
గోధుమ పిండిలోఉప్పు,రెండుస్పూన్స్నూనెవేసిసరిపడానీళ్ళతోచపాతిపిండిలాకలుపుకోవాలి.దానికినూనెపట్టించిఒకగంటసేపునాననివ్వాలి.తర్వాత శనగలు,పచ్చిమిర్చి
కరివేపాకు,కొత్తిమీరఅల్లంతరుగులనుమిక్షిలొ వేసికొద్దిగానీళ్ళుపోసిబరకగా 
ముద్దచేసుకోవాలి.తర్వాతకడాయిలోటేబుల్స్పూన్నూనెవేసిఉల్లిపాయముక్కలనుదోరగా వేయించుకోవాలి.
తర్వాత శనగల ముద్దవేసిపచ్చివాసనపోయేవరకు వేయించికారం,పసుపు,గరంమసాలవేసిమరో రెండునిముషాలు వేయించిదించేయాలి.తర్వాత నిమ్మకాయపరిమాణంలో చపాతిపిండితీసుకునిదానిమధ్యలోఉసిరికాయంతశనగల మిశ్రమాన్నిపెట్టి
మూసేసి,చపాతీలుగాఒత్తుకోవాలి.ఈచపాతీలను రెండువైపులానూనెవేస్తూ
దోరగాకాల్చుకోవాలి

బెల్లం ఉండలు

బియ్యం పిండి-గ్లాస్
బెల్లం-గ్లాస్
పచ్చికొబ్బరిముక్కలు-అరకప్పు
నువ్వులు-టీస్పూన్
ఏలకుల పొడి-చిటికెడు
బెల్లంలోనీళ్ళుపోసిలేతపాకంపట్టుకోవాలి.స్టవ్వెలిగించికడాయిపెట్టినువ్వులనువేయించిప్లేట్ లోకి తీసుకోవాలి.పచ్చికొబ్బరిముక్కలనుఅదేకడాయిలోవేసి వేయించాలి.బెల్లంపాకంలోనువ్వులు,పచ్చికొబ్బరి,ఏలకులపొడి,బియ్యంపిండి
ఒకదానితర్వాతఒకటివేసికలపాలి.
చల్లారినతరువాతచిన్నచిన్నపిండిముద్దలుతీసుకునిఉండలుగా చేసిపక్కనపెట్టాలి
ఇప్పుడుస్టవ్వెలిగించిబాణలిపెట్టినెయ్యిలేదానూనెవేసికాగాకముందుగా చేసిపెట్టుకున్నఉండలనుఅందులో వేసిరెండువైపులావేయించుకోవాలి

నల్లకారం

ధనియాలు-యాభయి గ్రాములు
తొడిమలుతీసినఎండుమిర్చి-యాబై గ్రాములు
పెద్దనిమ్మకాయ సైజుపరిమాణంలో చింతపండు
కరివేపాకు-రెండురెమ్మలు
మినుములు-చిటికెడు
వెల్లుల్లిరెబ్బలు-నాలుగు
జీలకర్ర-ఒకటీస్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-ఒకటేబుల్స్పూన్
స్టవ్వెలిగించిఒకకడాయిపెట్టివేడిచేయాలి.కడాయి వేడిఅయ్యాకఅందులోనూనెవేసికాగాబెట్టుకోవాలి.నూనెకాగాకముందుగా
జీలకర్ర,మెంతులు వేసిలోఫ్లేమ్లోపెట్టివేయించాలి.జీలకర్రచిటపట లాదాకతర్వాత
అందులోకరివేపాకు,ఎండుమిర్చివేసుకోవాలి.కరివేపాకును,ఎండుమిర్చినిలోఫ్లేమ్లోపెట్టిమరోరెండునిముషాలువేగనివ్వాలి.ధనియాలువేసుకోవాలి.దాదాపుఅయిదు
నిముషాలులోఫ్లేమ్లోవేయించాలి.తర్వాతఇందులోవెల్లుల్లిరెబ్బలువేసివేయించాలి.కొద్దిగాకలర్మారెంతవరకువేయించుకోవాలికలర్మారకస్టవ్ఆఫ్ చేసుకోవాలి
దీనిని పదినిముషాలుచల్లారనివ్వాలి.చల్లారినఈమిస్రమంను మిక్షిజార్ లోకితీసుకోవాలి.అందులోచింతపండు,తగినంతఉప్పువేసుకోవాలి.ఇవన్నివేసిమూతపెట్టిబాగామెత్తగాపొడిఅయ్యేంతవరకుgrind చేసుకోవాలి.

కరివేపాకు పొడి

కరివేపాకు-ఒకకప్పు
పచ్చిసెనగపప్పు-ఒకటేబుల్స్పూన్
చింతపండు-చిటికెడు
మినపప్పు-ఒకటేబుల్స్పూన్
ఎండుమిరపకాయలు-ఆరుఉప్పు-రుచికిసరిపడా
ముందుగాకరివేపాకుశుబ్రంగాకడిగిఒకపొడిబట్టమీదఆరబెట్టుకోవాలి.స్టవ్వెలిగించిఒకకడాయిపెట్టికాగనివ్వాలి.ముందుగమినపప్పువేసుకోవాలి.తర్వాతశనగపప్పువేసుకోవాలిఇవిరెండుబాగావేయిన్చుకోవాలి.ఈపప్పులువేగినతరువాతఇందులోనూనెవేసుకోవాలినూనెవేసినతరువాతఎండుమిర్చివేసుకోవాలి.అందులోనేకొద్దిగాచింతపండువేసిలోఫ్లేమ్లోపెట్టిరెండునిముషాలుఎండుమిర్చివేగే వరకువేయించాలి.
నీడలోఆరబెట్టుకున్నకరివేపాకువేయాలి.దానికితడిలేకుండాచూసుకోవాలి.అయిదునిముషాలుబాగాకరివేపాకుక్రిస్పిగఅయ్యేవరకువేయించాలి.ఇలాఅయినతరువాతస్టవ్ఆఫ్చేసుకునిపదినిమిషాలుమిస్రమంనుచల్లారనివ్వాలి
మిక్షిజార్లోకిఇవన్నివేసితగినంతఉప్పువేసుకోవాలిమెత్తగాపొడిఅయ్యేవరకుgrindచేసుకోవాలి

Tuesday, May 24, 2016

కొత్తిమీర రైస్::

కావలసినవి:
కొత్తిమీర - నాలుగు కట్టలు
టమాటాలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
సాజీరా - ఒక చెమ్చా
వండిన అన్నం - పెద్ద కప్పుతో
నూనె, ఉప్పు, పసుపు, నెయ్యి - తగినంత
వేయించిన జీడిపప్పు - 10
తయారీ విధానం:
1. ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండి పెట్టుకోవాలి.
2. తర్వాత మూకుడులో రెండు చెమ్చాల నూనె వేసి చిన్న ముక్కలుగా కోసిన టమాటా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసి మగ్గించాలి.
3. మూత పెట్టకుండా ఉంచితే నీరు పట్టదు పొడిపొడిగా వస్తుంది. మగ్గిన కొత్తిమీర, టమాటా మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఇప్పుడు ఒక పెద్ద మూకుడులో నాలుగు చెమ్చాల నూనె, ఒక చెమ్చా నెయ్యి వేసి కాగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సాజీరా, వెల్లుల్లి వేసి, సాజీరా ఎర్రగా కాకుండానే వెంటనే మెత్తగా రుబ్బిన కొత్తిమీర మిశ్రమాన్ని వేసి వేయించాలి.
5. కొంచెం తడి పోగానే ఉడికించిన అన్నం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి.
6. దాని మీద వేయించిన జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర రైస్ వేడివేడిగా తింటే చాలా రుచిగా వుంటుంది. బూందీ, రైతా దీని కాంబినేషన్.

Monday, May 23, 2016

రాజ్మ పనీర్ గ్రేవి

రాజ్మ -ఒక కప్పు 
పనీర్ -ఒక కప్పు 
ఉల్లిపాయ -ఒకటి 
పచ్చిమిర్చి -రెండు 
టొమాటోలు -మూడు 
కరివేపాకు -ఒక రెమ్మ 
కొత్తిమీర -కొద్దిగా 
మీగడ -రెండు స్పూన్స్ 
అల్లం వెల్లుల్లి ముక్కలు -ఒక టీ స్పూన్ 
గరం మసాల పొడి -ఒక టీ స్పూన్ 
ఉప్పు -రుచికి సరిపడా 
కారం -ఒక టీ స్పూన్ 
పసుపు -చిటికెడు 
రాజ్మను నానబెట్టి ఉడికించాలి .రెండు టీ స్పూన్స్ నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చిముక్కలు ,కరివేపాకు వేసి వేయించాలి ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి .తర్వాత టమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి .పసుపు ,కారం తగినంత ఉప్పు వేసి కలిపి రాజ్మా ,పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.గ్రేవీ చిక్కగాఅయ్యాకగరంమసాలపొడిచల్లిమీగడకూడావేసికలపాలి.చివరగాతరిగినకొత్తిమీరచల్లివేడివేడిగాచపాతీల్లోకితీసుకుంటేబాగుంటుంది

Sunday, May 22, 2016

పూరి చెక్కలు

మిరియాలపొడి-అరటీస్పూన్
మైదా పిండి-రెండుcups
ఎండుమిర్చిపొడి-రెండుటేబుల్స్పూన్స్
వాము-అరటీస్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
కరివేపాకు-రెండురెమ్మలు
నూనెవేయించడానికిసరిపడా
ఒకబౌల్ తీసుకునిఅందులోరెండుకప్పుల మైదాపిండివేసుకోవాలి.అందులోవాము,ఎండుమిర్చిపొడి,రుచికిసరిపడాఉప్పుకొద్దిగామిరియాలపొడివేసుకోవాలి.తరువాతఅందులోకరివేపాకునుచిన్నచిన్నగాచేసివేసుకోవాలి.ఇవన్నికలిసేలాకలుపుతూకొంచెంకొంచెంనీరుపోసిపూరిపిండిలచేసుకోవాలి.మెత్తగాపూరీలురావాలిఅంటేకొంచెంనూనెవేసిపిండిలోమరలబాగాకలుపుకోవాలి.ఈపిండికలిపెతెప్పుడుబోవ్ల్కిఅంటుకోకూడదు.అంతబాగాచేసుకోవాలి.చిటికెడువంటసోడావేసిమరలపిండినికలపాలిచేతికినూనెరాసుకునిపిండిని కొంచెంకొంచెం
తీసుకునిఒకేసైజులోబాల్స్ లచేసుకోవాలి
పూరీలుచేసుకోడానికికొంచెంమనంకొద్దిగామైదాపిండినిఒకగిన్నెలోకితీసుకోవాలి
పూరీలుగుండ్రంగారావాలిఅంటేఒకబౌల్తీసుకునివత్తితేగుండ్రంగావస్తుందిచూట్టుఉన్నపిండినితీసిపక్కనపెట్టుకోవాలి
ఈపూరినిత్రిభుజం ఆకారంలోచేసుకోవాలిచివరిగాఉన్నలేయర్వత్తాలి.
నాలుగుlayers ఉన్నపూరీలుతయారుఅవుతాయి
స్టవ్వెలిగించిదీపగాఉన్నబాణలి పెట్టివేయిన్చుక్డానికిసరిపడానూనెవేసుకోవాలివేగిననూనెలోతయారుచేసుకున్నవాటినివేసుకోవాలి.హైలోపెట్టుకునివేయించడంవాళ్లనూనె పీల్చదు.
వంటసోడా వేయడంవల్లపొంగుతాయిరెండువైపులాతిప్పుకునివేయించుకోవాలి.ఇవిగోల్డ్కలర్లో
వచ్చేవరకువేయించాలిఈహాట్పూరిచెక్కలునుఒకప్లేట్లోకితీసిపెట్టుకోవాలి

Thursday, May 19, 2016

ఆలు పరాటా

ఆలు పరాటా
ఆలుకర్రీ కోసం-
ఆలు-మూడు-ఉడికించితొక్కతీసిచిదమాలి
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-రెండు
అల్లంవెల్లుల్లిపేస్టు-ఒకటీస్పూన్ధనియాలపొడి-ఒకటీస్పూన్
ఉప్పు,కారం-రుచికితగినంత
గరం మసాల-ఒకటీస్పూన్
కొత్తిమీర-పదిరెమ్మలు
పసుపు-చిటికెడు
నూనె-టేబుల్స్పూన్
పరటా కోసం
గోధుమపిండి-కప్పు
మైదాపిండి-కప్పు
ఉప్పు-తగినంత
నూనె-రెండుటీస్పూన్స్
ముందుగగోధుమపిండిని,మైదాపిండిని ఉప్పు,నూనెనుతగినంతనీటితోకలిపిపక్కనఉంచుకోవాలి
ఇప్పుడుబంగాళదుంపకూరసిద్దం చేసుకోవాలి
బాండిలోనూనెవేడిఅయ్యాకతరువాతవరుసగాతరిగినఉల్లిపాయ,పచ్చిమిర్చిముక్కలు,అల్లంవెల్లుల్లిపేస్టు,ఉప్పు,కారం,పసుపు,గరంమసాలధనియాలపొడివేసుకోవాలి.ఇవన్నివేగాకచిదిమినబంగాలడుమ్పాలనువేసికలిపిచివరగాసన్నగాతరిగినకొత్తిమీరనుకలిపిదించాలి.ఇప్పుడుగోధుమపిండి మిశ్రమంనుచిన్నచపతీలుగాచేసిఅందులోఒకటీస్పూన్బంగాళదుంపకూరనుపెట్టిచపాతీఅంచులుమూసేసివత్తుకోవాలి.అలవట్టుకునేతప్పుడులోనున్నకూరబయటికిరాకుండాజాగ్రత్తగాచేసుకునిపెనంమీదనూనెవేస్తూకాలుకోవాలి

కాజు భర్ఫి

జీడిపప్పు-ఒకకప్పు
పాలు-పావుకప్పు
చెక్కర-పావుకప్పు
నెయ్యి-రెండుచెంచాలు
కిస్స్మిస్స్-తగినన్ని
జీడిపప్పునువేడినీటిలోఓగంటపాటునానబెట్టుకోవాలి.తరువాతనీతిలోనుంచితీసిమిక్షిలొవేసిమెత్తగాgrind చేసుకోవాలి.ఈమిశ్రమంలోచెక్కర,పాలువేసిబాగాకలపాలి
తరువాతస్టవ్వెలిగించినెయ్యివేడిచేసిజీడిపప్పుమిస్రమంనువేయాలితక్కువమంటమీదతడిఇగిరిపోయిమిశ్రమందెగ్గరగాఅయ్యేదాకాఉడికించాలి
తరువాతదించేసుకునిమనకునచ్చినఆకారంలోఒత్తుకునిమధ్యలోకిస్స్మిస్స్నుఉంచాలి

ఆలు కచోరి

ఆలు కచోరి 
మైదా పిండి -రెండు కప్పులు 
బంగాలదుంపలు -మూడు 
ఉల్లిపాయలు -మూడు 
పచ్చిమిర్చి -మూడు 
అల్లంవెల్లుల్లి పేస్టు -ఒక టీ స్పూన్ 
నూనె -రెండు టేబుల్ స్పూన్స్ 
జీలకర్ర -అర టీ స్పూన్ 
కరివేపాకు ,కొత్తిమీర -ఒక్కోటి రెండు రెమ్మలు 
కారం -ఒక టీ స్పూన్ 
పసుపు -చిటికెడు 
ఉప్పు -రుచికి సరిపడా 
గరం మసాల పొడి -ఒక టేబుల్ స్పూన్ బంగాలడుమ్పాలను ఉడికించి పైన తొక్క తీసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ,ఉల్లిపాయలను పచ్చిమిర్చినిముక్కలుగాచేసిపెట్టుకోవాలి
కూరకు
పొయ్యిమీదబాణలి పెట్టివేడిఅయ్యాకనూనెపోసివేడిఅయ్యాకజీలకర్రవేసుకోవాలి.ఉల్లిపాయలువేయాలిమీడియంఫ్లేమ్లోపెట్టిమూతపెట్టాలి.ఇలావేగినఉల్లిపాయలతర్వాతపచ్చిమిర్చివేయించాలిమూతపెడితేతొందరగావేగుతాయిఇప్పుడుఅల్లంవెల్లుల్లిపేస్టువేసిపచ్చివాసనపోయేవరకువేయించాలి.దానికిసరిపడాకారం,ఉప్పువేసుకోవాలిఉల్లిపాయలకుబాగాఅంతెత్తురెండునిమిషాలపాటు తిప్పుతూఉండాలి.ఉడకబెట్టినబంగాళాదుంపలనువేసుకోవాలి
ఇందులోనీళ్ళుపోయకూడదుకాబట్టినూనెకొంచెంఎక్కువవాడుతం.బంగాలడుమ్పాలనుచిన్నగాకట్చేసుకుంటేఈstuffingకుచాలబాగుంటుంది
అయిదునిమిషాలవరకుమూతపెట్టిమగ్గనివ్వాలినీరుపోయకూడదు.కూరబాగాఉడికినతరువాతఇందులోగరంమసాలపొడివేసుకోవాలికొత్తిమీరకరివేపాకువేసికలియపెట్టాలిమరోఅయిదునిముషాలుమూతపెట్టిమగ్గనివ్వాలిఅప్పుడుకూరతయారుఅయినట్లు
ఈకూరనుకాసేపుచల్లారనివ్వాలి
ఇంతలోమనంమైదా పిండినిచపాతిపిండిలకలుపుకోవాలి.కొంతపిండితీసుకుని
చపాతిలచేసికొంచెంకూరపెట్టిమొత్తంఅంచులు మూసిమరలవత్తాలివేయించడానికిసరిపడానూనెలోకచోరిలువేసిగోధుమరంగులోకివచ్చేవరకుమీడియంఫ్లేమ్ల్పెట్టివేయించుకోవాలి

Monday, May 16, 2016

మొక్కజొన్న టిక్కి

మైదా -ఒక టేబుల్ స్పూన్ 
మొక్కజొన్న గింజలు-ఒకకప్పు
ఉడికించినబంగాలదుంపలు-రెండు
పచ్చిమిర్చి-మూడు
ఉల్లిపాయ-ఒకటికొత్తిమీర-నాలుగుకాడలు
అల్లంవెల్లుల్లిపేస్టు-అరటీస్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-వేయించడానికిసరిపడా
బంగాళాదుంపలను చిదిమి ,మొక్కజొన్నగింజలు,అల్లంవెల్లుల్లిపేస్టు,మైదా
పచ్చిమిర్చితరుగు,ఉల్లి,కొత్తిమీరతరుగు,ఉప్పువేసికలపాలి.ఈమిస్రమంనుకొద్దికొద్దిగాతీసుకునితిక్కిలుగాచేత్తోవొత్తి పెనంమీదనూనెరాసిదోరగాకాల్చుకోవాలి

Sunday, May 15, 2016

ఆలుగడ్డ టమాటా కూర . . . .

ఆలుగడ్డలు . . నాలుగు . . 
టమాటాలు . . . నాలుగు . . 
మిరపకాయలు . . నాలుగు . .
ఉల్లిగడ్డలు . . . . ముడు . . .
కోతిమీరు . . . ఒక కట్ట . . .
అల్లం పేస్ట్ . . . . కొద్దిగా . . .
కారం . . . . కొద్దిగా . . .
ఉప్పు . . . . . . కొద్దిగా
గారం మసాల . . కొద్దిగా
కర్రిపౌడర్ . . . . కొద్దిగా
జీలకర్ర . . . ఆవాలు కొన్ని . . .
కావలిసినంత మంచి నూనే . . .
వండే విధానం . . . . .
ముందుగాల . . . ఆలుగడ్డలు ఉడుకు పెట్టి కొని పొట్టు తీసి ముక్కల్ ముక్కల్ కోసుకొని పెట్టుకో . . .
అ తరువాత . . . టమాటాలు ఉల్లిగడ్డలు కోసుకొ
మీరపకయలు . . కోతిమిరు కోసుకొని పక్కన పెట్టుకో
గిన్నెలో నూనే పోయు . .
గారం కాగానే . . . ఆవాలు జిలికర్ర అందులో వెయ్యి
మిరపకాయలు వెయ్యి . . . మూత వెట్టి ఒక్క నిముషం ఆగు
తరువాత ఉల్లిగడ్డలు వెయ్యి తరువాత మంచిగ కళ్ళే కలుపుకుని . . . కొద్దిగా పసుపు అల్లం వెయ్యి . . . మంచిగా కలిపి మూత వెట్టి రెండు నిముషంలు ఆగు . . . .
మల్ల తరువాత మంచిగ ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్ని గోళీనంకా . . . అలుగడ్డలు వెయ్యి . . మంచిగ నూనేల గోలలి అవి తరువాత మూత వెట్టి . . . రెండు మూడు నిముషాలు ఆగాలి . . . తరువాత టమాటాలు వేసుకోవాలి . . .
టమాటాలు ఉడికినంకా . . . కరం ఉప్పు గరం మసాల కర్రిపౌడర్ వెయ్యలి వేసి మంచిగ కలుపుకొని మూత వెట్టి కొద్దిగా సేపు ఆగాలి ఒక్క నిముషం . . . . అంతే తరువాత కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొవాలి నాలుగు ఐదు నిముషాలు మంచిగ మూత వెట్టి ఉండకా వెట్టిలి గంతే. . . .
టమాటా ఆలుగడ్డ కూర తయారైంది . . . . 😋
😋😋

Friday, May 13, 2016

గోధుమ డ్లీలు

గోధుమలు ఆరోగ్యానికి ఏంటో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గోధుమలతో కేవలం చపాతీలు మాత్రమే కాదు ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
గోధుమలు - 1 1/2 కప్పు , మినప్పప్పు - 1 కప్పు,నానబెట్టిన బఠాణీ - 1/4 కప్పు ,క్యారట్ తురుము - 1/4 కప్పు ,బీన్స్ తరుగు - 1/4 కప్పు,పెరుగు - 1/2 కప్పు ,కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు,ఆవాలు - టీ స్పూను , మినప్పప్పు - 2 టీ స్పూన్లు, శెనగపప్పు - 2 టీ స్పూన్లు ,అల్లం తరుగు - 1 స్పూను ,పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు ,ఉప్పు - తగినంత
తయారి విధానం:
గోధుమలను రెండు గంటలు మినప్పప్పును అర గంట నీటిలోనానబెట్టాలి. అలా అవి నానిన తర్వాత గోధుమలను మరీ మెత్తగా కాకుండాకొంచం బరకగా మిక్సీ పట్టాలి. మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి. (అంటే మనం ఈ ఇడ్లి వేసుకోవాలనుకనే ముందు రోజు రాత్రి పిండిని తయారు చేసుకుంటే మంచిది). బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి. నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి మరోసారి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని ఇడ్లీ రేకులలో వేసి మాములు ఇడ్లీల లాగానే ఉడికించుకోవాలి.

ఉల్లిపాయ చెట్నీ

: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - మూడు, పచ్చిమిరపకాయలు - ఆరు, జీలకర్ర - ఒక టీ స్పూను, కొత్తిమీర - ఒక కట్ట, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి రేకలు - నాలుగు, శెనగపప్పు - రెండు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఆవాలు - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి వేగించాలి. వేగాక దించేసి, చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యిమీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు,కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేగించి ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి.
పూరిల్లోకి చపాతీలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది .

అరటికాయ వేపుడు

కావలసిన పదార్దములు :
అరటికాయలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
పోపు దినుసులు : రెండు టీ స్పూన్లు
(ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు సెనగపప్పు )
ఎండిమిర్చి: రెండు
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం : టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్టూ : అర టీ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా
తయారుచేయు విధానం :
1) అరటికాయల్నిఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి.
2) తరువాత వలిచి చిన్నచిన్న ముక్కలు ఉండేలా చిదపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగాక, పోపు దినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, అల్లంవెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగానివ్వాలి.
5) పసుపు వేసి కలిపి, చిదిమిన అరటికాయపొడిని, ఉప్పు వేసి కలిపి ఒక నిముషo మూతపెట్టి ఉంచాలి.
6) ఇప్పుడు స్టవ్ ఆపి, నిమ్మ రసం కలిపి కొత్తిమిర జల్లి వడ్డించాలి
* అంతే అరటికాయ వేపుడు రెడి. (దినినినే అరటికాయ పొడికూర అని కుడా అనొచ్చు)

ములక్కాయ కూర :-

ములక్కాయ,సొరకాయ ఇలా అన్ని పాలుపోసి చేసే కూరలూ వేడి వేడి అన్నంలో తినడానికి బావుంటాయి.బుజ్జి కుక్కర్ లో చేస్తే అయిదు నిమిషాల్లో చాలా తొందరగా అయిపోతాయి.

కావలసిన పదార్ధాలు :-

ములక్కాయలు రెండు
ఉల్లిపాయలు మూడు
మిర్చి మూడు
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్పు,కారం తగినంత
పసుపు కొంచెం
పాలు అర కప్పు
నూనె మూడు టేబుల్ స్పూన్లు
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి

తయారు చేసే విధానం :-

నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించాలి. ఇప్పుడు కడిగిన ములక్కాయ ముక్కలు వేసి వేయించాలి రెండునిమిషాల తరువాత ఉప్పు,కారం పసుపు వేసి అరగ్లాసు నీళ్ళు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి స్టీం పోయిన తరువాత తీసి నీరు ఇగిరే వరకు ఉడికించి అప్పుడు ఒక కప్పు పాలుపోసి అవి ఇగిరి కూర చిక్కబడేవరకు ఉంచి దించెయ్యాలి ఇందులో పాలు పోసేటప్పుడు ఒక స్పూన్ శనగపిండి పాలలో కలిపి వేస్తే కూడా కూర చాలా రుచిగా ఉంటుంది.గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది.

కాకరకాయ నువ్వుల పులుసు:::

కావలసిన పదార్థాలు
కాకరకాయలు - 5, బెల్లం - 2 స్పూన్స్క, రివేపాకు - కొద్దిగా, పచ్చిమిర్చి - 3, పసుపు - 1/4 స్పూన్నూ, నె - 5 స్పూన్స్ను, వ్వుల పొడి - 4 స్పూన్స్, ఉప్పు, కారం - సరిపడ, ధనియాల పొడి - 1 స్పూన్ , చింతపండు - కొద్దిగా, పోపు గింజలు - 1 స్పూన్
*********************
ఇలా చేసుకుందాము :
ముందుగా కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
చింతపండు నానపెట్టి బాగా గుజ్జు తయారు చేసుకోవాలి.
అర కప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. తరువాత నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి.
తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి 10 నిముషాలు వేయించిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో పోపు పెట్టి, వేగాక చింతపండు గుజ్జు, అరకప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి. తరువాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి.
ఇప్పుడు అందులో బెల్లం కలిపిన నీళ్ళు మరియు నువ్వుల పొడి వేసి మూత పెట్టి ముక్కలు బాగా మెత్తగా అయ్యేవరకు ఉంచి దించెయ్యాలి.
అంతే రుచికరమైన కాకరకాయ నువ్వుల పులుసు

కాకరకాయ కాయ పలంగా కూర :::

ఈ గుత్తి కాకరకాయకు పొట్టి కాకరకాయలైతే బాగుంటుంది.అవి దొరకని పక్షంలో పొడుగు కాకరకాయల్ని వేలెడంత ముక్కలుగా కోసుకుని ప్రయత్నించొచ్చు .
కావలసిన పదార్థాలు
కాకరకాయలు – పావుకిలో
శనగపిండి – ఒక కప్పు
కారం – రెండు చెంచాలు
ఉప్పు – ఒక చెంచా
నూనె – ఒక చిన్న కప్పు
కాకరకాయలు నీటితో కడిగి తడి ఆరేదాక ఉంచాలి. ఒక కప్పులో శనగపిండి, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిపాక ఒక రెండు స్పూన్స్ నూనె పోసి మళ్ళీ బాగా కలపాలి.తడి ఆరిన కాయల్ని గుత్తిగా కోసుకోవచ్చు లేదా కాయ పొట్ట మీద నిలువుగా గాటులా పెట్టి చీల్చుకోవచ్చు . ఇలా తరిగిన కాయల్లో శనగపిండి మిశ్రమాన్ని కూరుకోవాలి. మిగిలిన పిండిని అలా ఉంచాలి.మూకుడులో ఒక గరిట లో సగానికి నూనె పోసి కాకరకాయల్ని వేసి మూత పెట్టాలి. మధ్య మధ్య లో మూత తీసి జాగ్రత్తగా కలపాలి.కాయలు బాగా వేగాక మిగిలిన పిండి వేసి సరిపడా నూనె పోసి తిప్పి ఒక ఐదు నిమిషాలకి స్టవ్ ఆపేయచ్చు. కాయలు క్రిస్పీ గా రావాలంటే మూకుట్లో కాకరకాయ వేస్తున్నప్పుడు సరిపడా నూనె పోసేసుకోవాలి. కాయలు వేగాక మిగిలిన పిండి పైన వేసాక ఇక నూనె పోయకూడదు.

కాకరకాయ పచ్చడి , (Bitter guard pickle)

కావలసిన పదార్ధాలు:
పెద్దగా తరిగిన కాకరకాయముక్కలు - 1 కిలో , చింతపండు గుజ్జు - 150 గ్రామ్స్ , ఉప్పు - 200 గ్రామ్స్ , కారం - 15౦ గ్రామ్స్ , బెల్లం - 5౦ గ్రామ్స్ , మెంతిపొడి - 5౦ గ్రామ్స్ , పసుపు - 1 టీ స్పూను , నూనె - 15౦ గ్రామ్స్ , ఆవాలు - 1/4 కప్పు , ఇంగువ - 1/2 టీ స్పూను .
తయారు చేసే పధ్ధతి:
స్టవ్ వెలిగించి వెడల్పు గిన్నె పెట్టి నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడు 2 చెంచాల ఉప్పు , కొంచెం చింతపండు వేసి కాకరకాయ ముక్కలు వేసి 1౦ నిమిషాలు ఉడికించి నీళ్ళు వోడ్చాలి . ముక్కలు చల్లారాకా వెడల్పు బేసిన్ లో వేసిఉప్పు , పసుపు , చింతపండు గుజ్జు , బెల్లం , మెంతిపొడి , వేసి కలిపి మూత పెట్టి 3 రోజులు ఉంచాలి . తరవాత బాగా కలిపి , స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాకా ఇంగువ , ఆవాలు వేసి చిటపటలాడాకా దించి చల్లారాకా పచ్చడిలో కలిపి మూత పెట్టి ఒక రోజు ఉంచాలి .
(ఒంపిన నీటిని కాకరకాయ పులుసులో కలపి వాడండి)

కాకరకాయ పులుసు బెల్లం కూర: .

తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:-
1/4 కిలో కాకరకాయలు , చిన్న నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పెద్ద స్పూన్ పొడి కారం, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క, నూనె తగినంత అంటే రెండు గరిటలు ,పోపు దినుసులు, కరివేపాకు

తయారుచేయు విధానం:-
ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి, చక్రాలుగా తరిగి, స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి, ఆ ముక్కలలో చింతపండు రసం వేసి చిటెకెడు పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలి పెట్టుకుని, నూనె వేసి,పోపుకు సరిపడా మినప్పప్పు, 5 ఎండుమిరపకాయలు,కొద్దిగా ఆవాలు,
వేసి వేగాక, ఉడికించి పక్కన పెట్టుకున్న కాకర చక్రాలను పోపులో వెయ్యాలి.కాకర ముక్కల్ని కదుపుతూ ముందుగ తురిమి ఉంచుకున్న బెల్లం తురుము,పోడికారము వేసి కదుపుతూ 5 నిమిషాలు ఉంచి దించెయ్యాలి.అంతే కాకరకాయ పులుసు బెల్లం కూర రెడీ...... మనదే ఆలస్యం smile emoticon

నువ్వుల చింతచిగురు పచ్చడి

చింతచిగురు-కప్పు
నువ్వులు-మూడుచెంచాలు
ఆవాలు-చెంచ
ధనియాలు-చెంచ
మెంతులు-పావుచెంచ
ఎండుమిర్చి-పది
పచ్చిమిర్చి-అయిదు
నూనె-ఒకటేబుల్స్పూన్
కరివేపాకు-రెండురెబ్బలు
మినపప్పు,సెనగపప్పు-అరచెంచచొప్పున
ఉప్పు-తగినంత
బాండిలో నూనె వేడిచేసి ఇంగువ,నువ్వులు,ఆవాలు,ధనియాలు,మెంతులు
ఎండుమిర్చి,మినపప్పు,శనగపప్పు,వేసివేయించుకోవాలి.అన్నివేగాకదింపేసికరివేపాకు,కడిగినచింతచిగురు తలిమ్పులో వేయాలి.
ఈతాలింపు చల్లారాక మిక్షిజరలోకి తీసుకునిపచ్చిమిర్చి తగినంతఉప్పువేసుకుని మెత్తగాgrind చేసుకోవాలి

Saturday, May 7, 2016

• చింత చిగురు పులిహోర

కావలసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) చింతచిగురు - 1 కప్పు, పొడి అన్నం - 2 కప్పులు, వేరుశనగ పప్పు - 3 టేబుల్‌ స్పూన్లు, శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, పసుపు - అర టీస్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఎండు మిర్చి - 3, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం: అన్నం (ఉడుకుతున్నప్పుడే ఒక టీ స్పూను నూనె, చిటికెడు ఉప్పు కలిపి) పొడిగా వండి చల్లార్చాలి. అర టీ స్పూను నూనెలో చింతచిగురును పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి ఎండుమిర్చి, వేరుశనగలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ లతో తాలింపు వేసి ఉప్పు, చిగురుతో పాటు అన్నంలో కలపాలి.
ఈ చింత చిగురు పులిహోర వేసవిలో తప్ప మరోకాలంలో చేసుకునే అవకాశం లేదు కాబట్టి వెంటనే చేసేయండి.