Monday, March 4, 2013

పుల్లట్టు

కావలసిన పదార్థాలు :
పుల్లటి మజ్జిగ... మూడు కప్పులు
బియ్యం... ఒక కప్పు
మెంతులు... రెండు టీ.
జీలకర్ర... ఒక టీ.
బజ్జీ మిరపకాయలు... ఆరు
ఉప్పు... తగినంత
జీలకర్ర... ఒక టీ.
నూనె... పావు కప్పు

తయారీ విధానం :
మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తరువాత మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్రలను దంచి పిండిలో కలిపి దోశెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి. పెనంమీద కొద్దిగా నూనె రాసి, గరిటెడు పిండి పోసి, దోశెలాగా పామి నూనె వేస్తూ.. రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి పుల్లట్టు తయార్...! ఏదేని చట్నీతో కలిపి వేడిగా తింటే చాలా బాగుంటాయి.

0 comments:

Post a Comment