Thursday, October 8, 2015

* ఆనియన్‌ రవ్వ దోశ

• కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం - అర అంగుళం (సన్నగా తరగాలి)
మిరియాలు - అర టీస్పూను
జీలకర్ర - పావు టీస్పూను
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 3
వేయించిన జీడిపప్పు పలుకులు - 3 టీస్పూన్లు
• తయారీ విధానం:
బియ్యం పిండి, రవ్వలకు నీళ్లు చేర్చి గంట జారుడుగా కలుపుకోవాలి.
జీలకర్ర, ఉప్పు పిండిలో వేసి కలపాలి.
పిండిని 4 గంటలపాటు పక్కన ఉంచి.. పులియనివ్వాలి.
ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, మిరియాలు కూడా వేసి కలుపుకోవాలి.
పెనం వేడిచేసి కాసింత నూనె పోయాలి.
పిండిని దోశలా పోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు చల్లాలి.
నూనె పోసి దోశ కాల్చాలి.
వేడిగా సాంబార్‌ లేదా చట్నీతో వడ్డించాలి.

0 comments:

Post a Comment