Sunday, October 18, 2015

మసాలా పూరీలు

• కావలసినవి 
మైదాపిండి: 2 కప్పులు, సెనగపిండి: ఒకటిన్నర కప్పులు, కరివేపాకు: 2 రెబ్బలు, మెంతికూర తరుగు: 2 టీస్పూన్లు, పసుపు: పావుటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, దనియాలపొడి: టీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, షాజీరా: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

• తయారుచేసే విధానం

* ఓ గిన్నెలో జల్లించిన మైదాపిండి, సెనగపిండి తీసుకుని అందులో పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా, షాజీరా, సన్నగా తరిగిన కరివేపాకు, మెంతికూర, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి, తగినంత ఉప్పు కూడా వేసి చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. అరగంట తరవాత మృదువుగా పిసికి చిన్న ఉండలుగా చేసుకోవాలి.

* ఒక్కో ముద్ద తీసుకుని పలుచగా పూరీలా వత్తి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి. ఈ పూరీలు నాలుగైదు రోజుల వరకూ నిల్వ ఉంటాయి.

0 comments:

Post a Comment