Tuesday, October 13, 2015

* క్షీరాన్నం

• కావల్సినవి: బియ్యం - అరకప్పు, చిక్కని పాలు - నాలుగుకప్పులు, చక్కెర - ముప్పావుకప్పు, యాలకులపొడి - కొద్దిగా.

• తయారీ: బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక అందులో బియ్యం వేసేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే అన్నం ఉడుకుతుంది. అన్నం మెత్తగా అయ్యాక యాలకులపొడి వేసి కలిపి దింపేయాలి. తరవాత ఇందులో చక్కెర వేసి అది కరిగేదాకా కలపాలి.

0 comments:

Post a Comment