Tuesday, October 6, 2015

• మెంతి, పెసరపప్పు అట్టు..

• మెంతి, పెసరపప్పు అట్టు..

ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో పోషక విలువలు బాగా ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు: బియ్యం- ఒక కప్పు, పెసరపప్పు- అరకప్పు, తరిగిన మెంతి- కప్పు, తరిగిన అల్లం ముక్కలు- ఒక టేబుల్‌ స్పూను, సిలాంత్రో- ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు-తగినంత.

తయారుచేసే విధానం: బియ్యం, పెసరపప్పులను రెండు గంటల పాటు నీళ్లల్లో వేసి నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ పిండిని రూమ్‌ టెంపరేచర్‌లో నాలుగు గంటల పాటు అలానే ఉంచాలి. తర్వాత అందులో తరిగిన అల్లంముక్కలు, మెంతి వేసి కలపాలి. ఉప్పు తగినంత వేయాలి. ఆ తర్వాత వేడి పెనం మీద నూనె వేసి ఈ పిండిని అట్టులా పోయాలి. ఈ అట్లు ఎంతో రుచిగా ఉంటాయి.

0 comments:

Post a Comment