Tuesday, October 6, 2015

రాగులు జీర్ణకోశానికి ఎంతో మంచిది. అంతేకాదు ఇందులో అధికపాళ్లల్లో ఐరన్‌ ఉంటుంది. ఇది మనల్ని అన్ని రకాల వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
కావాల్సిన పదార్థాలు: రాగిపిండి-రెండు టేబుల్‌స్పూన్లు, పాలు-250 గ్రాములు, బెల్లం-1.5 టేబుల్‌స్పూన్‌, ఏలక్కాయలు-2, రోస్టెడ్‌ బాదంపప్పులు-తగినన్ని.
తయారుచేసే విధానం: రాగి పిండిని కడాయిలో వేసి రెండు మూడు నిమిషాలు వేయించి తర్వాత బాగా చల్లారనివ్వాలి. రాగిపిండి, పాలు బాగా కలిసిపోయేలా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని స్టవ్‌ మీద పెట్టి దగ్గర పడేవరకూ ఉడికించాలి. ఆ మిశ్రమం క్రీములా తయారవుతుంది. అందులో బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలో పోసి వేయించిన బాదంపప్పులతో దాని పైభాగాన్ని అలంకరించాలి.
ఇది తింటే జీర్ణాశయానికి ఎంతో మంచిది.

0 comments:

Post a Comment