Tuesday, October 13, 2015

* కదంబం

• కావల్సినవి: బియ్యం - కప్పు, కందిపప్పు - అరకప్పు, పెసరపప్పు - టేబుల్‌స్పూను, బెండకాయ, మునక్కాయ, చిలగడదుంప, వంకాయ, క్యారెట్ - ఒక్కోటి రెండుచొప్పున, సొరకాయ, తీపిగుమ్మడికాయ - చిన్న ముక్క చొప్పున, బీన్స్ - ఐదారు, బంగాళాదుంప - ఒకటి, చింతపండు గుజ్జు - ఒకటిన్నర టేబుల్‌స్పూను, సాంబారుపొడి - మూడు చెంచాలు, పసుపు - చెంచా, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండుటేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, కరివేపాకు రెబ్బలు - రెండుమూడు, ఎండుమిర్చి - మూడు, ఇంగువ - పావుచెంచా, ఉప్పు - తగినంత.

• తయారీ: బియ్యం, కందిపప్పూ, పెసరపప్పూ కుక్కర్‌లోకి తీసుకుని బాగా కడగాలి. తరవాత అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. మూడుకూతలు వచ్చాక దింపేయాలి. మరో కుక్కర్ గిన్నెలో కూరగాయ ముక్కలన్నీ తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి పసుపు వేసి పొయ్యిమీద పెట్టాలి. ఒక కూత వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఈ కూరగాయముక్కల్లో చింతపండుగుజ్జూ, తగినంత ఉప్పూ, సాంబారుపొడీ వేసి బాగా కలిపి మరోసారి పొయ్యిమీద పెట్టాలి. ఐదు పది నిమిషాలయ్యాక ఇందులో ముందుగా ఉడికించిన అన్నం కలిపి మంట తగ్గించాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి కరిగించి ఇంగువా, ఎండుమిర్చీ, ఆవాలూ, జీలకర్రా, కరివేపాకు రెబ్బలూ వేయాలి. అన్నీ వేగాక ఈ తాలింపును అన్నంపై వేసి కలిపి పొయ్యి కట్టేయాలి.

0 comments:

Post a Comment