Tuesday, October 20, 2015

బియ్యం సత్తుపిండి

కావల్సినవి: బియ్యం - అరకప్పు, యాలకులు - రెండు, కరిగించిన నెయ్యి - టేబుల్‌స్పూను, చక్కెర - అరకప్పు కన్నా కొద్దిగా తక్కువగా.

తయారీ: ముందుగా బియ్యాన్ని నూనె లేకుండా బాణలిలో వేయించుకోవాలి. వేడి చల్లారాక బియ్యంలో చక్కెరా, యాలకులూ వేసుకుని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సత్తుపిండిని ఓ గిన్నెలోకి తీసుకుని కరిగించిన నెయ్యి వేసి కలపాలి. ఇది ముద్దలా కాకుండా పొడిపొడిగానే ఉండేలా చూసుకోవాలి.

0 comments:

Post a Comment