Friday, July 24, 2015

కుష్బూ ఇడ్లీ

కుష్బూ ఇడ్లీ
కావలసిన పదార్థాలు:
ముడి బియ్యం - రెండు కప్పులు, మినపప్పు - అర కప్పు, సగ్గుబియ్యం - పావు కప్పు, ఉప్పు - తగినంత, వంట సోడా - పావు టీస్పూన్‌
తయారీ:
ముడిబియ్యం, మినపప్పు, సగ్గుబియ్యంలను శుభ్రంగా కడిగి పది గంటలు నానబెట్టాలి. వాటన్నింటినీ కలిపి ఇడ్లీ పిండిలా రుబ్బాలి. ఈ పిండి కనీసం పదిగంటల సేపైనా పులవలి. అంటే ముడిబియ్యం, మినపప్పు, సగ్గుబియ్యాలను ఉదయం నానబెట్టాలి. సాయంత్రం పిండి పట్టి మరుసటిరోజు ఇడ్లీల్లా వేసుకోవాలన్నమాట. అచ్చం మామూలు ఇడ్లీకి మల్లే. పిండిలో కొంచెం వంట సోడా కలిపి ఇడ్లీ ప్లేట్లలో వేసి ఉడికించాలి. సాంబారుతో కలిపి వీటిని తింటే చాలా బాగుంటాయి.

0 comments:

Post a Comment