Tuesday, July 28, 2015

పప్పు చారు

కందిపప్పు 200 gm
చింతపండు 50 gm
ఉల్లిపాయ 1
టొమాటో 2
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 రెబ్బ
కొతిమిర 1 కట్ట
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఎండుమిర్చి 4
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp

ముందుగా కందిపప్పును కొద్దిగా పసుపు,నూనె వేసి కుక్కర్లో మెత్తగా
ఉడికించుకోవాలి. చింతపండు నీళ్ళలోనానబెట్టాలి . ఉల్లిపాయ,పచ్చిమిర్చి,
టొమాటోలు తరిగి పెట్టుకోవాలి. పప్పును గరిటతో మెదిపి చింతపండు
పులుసు తీసి అందులో కలపాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడి చేసి
ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర వేసిఅవి చిటపటలాడాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,
టొమాటో ముక్కలు వేసి కొద్దిగావేపాలి. పసుపు,కారంపొడి,కరివేపాకు వేయాలి.
అవి మెత్తబడ్డాక పప్పు మిశ్రమాన్ని అందులో పోసి తగినంతఉప్పు,కొద్దిగా బెల్లం
కాని చక్కెర కాని వేయాలి. పప్పు చారు ఐదు నిమిషాలు మరిగిన తర్వాత
కొత్తిమిర వేసిదింపేయాలి. కొద్దిగ నెయ్యి వేస్తె సూపర్ గా ఉంటుంది

0 comments:

Post a Comment