Monday, July 27, 2015

వడ


మినప్పప్పు 200 gms
పచ్చిమిర్చి 6
అల్లం 1 " ముక్క
కరివేపాకు 1 రెబ్బ
ఉప్పు తగినంత
నూనె - వేయించడానికి

ముందుగా మినప్పప్పును శుభ్రం చేసి నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత వడగట్టి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా కాటుకలా గ్రైండ్ చేసుకోవాలి. ఉన్నా తడి సరిపోతుంది. నీళ్లు పోస్తే పిండి పలుచబడుతుంది. చివర్లో తగినంత ఉప్పు, సనంగా తరిగిన కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసి పిండిని చిన్న ముద్దలుగా తీసుకుని తడి చేత్తో ప్లాస్టిక్ కాగితంపైన లేదా అరిటాకుపైన వేదలుపుగా వత్తుకుని మధ్యలో వేలితోనే చిల్లు పెట్టి నూనె లో వేసి బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించి తీసేయాలి. వీటిని కొబ్బరి చట్నీ, సాంబార్ తో వడ్డించండి.

0 comments:

Post a Comment