Monday, July 27, 2015

పులగం


బియ్యం 250 gms
పెసరపప్పు 100 gms
పచ్చిమిర్చి 6
ఆవాలు 1/4 gms
జీలకర్ర 1/4 gms
అల్లం చిన్న ముక్క
కొత్తిమిర 1/2 కట్ట
జీడిపప్పు 10
మిరియాలు 8
నెయ్యి 4 tbsp
నూనె 2 tsp
ఉప్పు తగినంత

బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి అరగంట నీటిలో నానబెట్టాలి. వెడల్పటి గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వరసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళు పోసి మరిగించాలి. తర్వాత బియ్యం, పప్పు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.రంగు కావాలంటే పావు టీస్పూను పసుపు వేసుకోవచ్చు. అడుగంటకుండా కలుపుతూ మొత్తం ఉడికాక కొత్తిమిర కలిపి దింపేయాలి.

0 comments:

Post a Comment