Tuesday, July 28, 2015

సగ్గుబియ్యం ఇడ్లీ


సగ్గుబియ్యం 2 కప్పులు
పుల్లని మజ్జిగ 2 కప్పులు
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి4
ఉప్పు తగినంత
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/2 tsp
సెనగపప్పు 1/2 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 1 కట్ట
నూనె 2 tbsp

సగ్గుబియ్యాన్ని పుల్లనిమజ్జిగలో కనీసం ఆరు గంటలు నానబెట్టాలి (మజ్జిగ మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి). ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుల్ని సన్నగా తరగాలి.బాణలిలో నూనె వేడి చేసి తాలింపు పెట్టి అందులో నాంబెట్టిన సగ్గుబియ్యం వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. కొత్తిమిర సన్నగా తరిగి ఈ మిశ్రమమలో కలపాలి. ఈ సగ్గుబియ్యం పిండిని ఇడ్లీల మాదిరిగా వేసి 15 నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి. మెత్తగా ఉండే ఈ సగ్గుబియ్యం ఇడ్లీలను టోమాటో చట్నీ కాని కొబ్బరి చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి.

0 comments:

Post a Comment