Saturday, March 22, 2014

ఇడ్లీ పిండి బోండాలు

కాలవసిన దినుసులు:
ఇడ్లీ పిండి – రెండు కప్పులు
ఉప్పు – 1 టేబుల్ స్పూన్
ఉల్లి పాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం:
ముందుగా  ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర తరిగి, ఇడ్లీ పిండిలొ కలుపుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపి ప్రక్కన పెట్టు కోవాలి. కడాయి పొయ్యి మీద పెట్టి, నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా మరిగినప్పుడు, ఇడ్లీ పిండిని చేతితొ గుండ్రంగా చేసి,  నూనెలొ వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ బోండాలు పల్లి పచ్చడితొ తింటే చాల రుచిగా వుంటాయి. అంతే! ఎంతో రుచిగ వుండే ఇడ్లీ పిండి బోండాలు రెడీ. 

0 comments:

Post a Comment