Sunday, March 9, 2014

సగ్గుబియ్యం ఇడ్లీలు

కావలసిన పదార్ధాలు :

సగ్గు బియ్యం -2 కప్పులు ,పుల్లమజ్జిగ -2 కప్పులు ,ఉల్లిపాయ -1,పచ్చిమిర్చి-3,ఆవాలు -1/2 టీ స్పూను ,శెనగ పప్పు -1/2 టీ స్పూను ,మినపప్పు -1/2 టీ స్పూను ,ఇంగువ -చిటికెడు ,కరివేపాకు రెమ్మలు -2,కొత్తిమీర తురుము -2 టేబుల్ స్పూన్లు ,ఉప్పు -రుచికి తగినంత ,నూనె -2 టేబుల్ స్పూన్లు .

తయారు చేసే పధ్ధతి :

పుల్లమజ్జిగలో సగ్గు బియ్యాన్ని వేసి 5 గంటలు నానబెట్టాలి .స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాకా శెనగ పప్పు,మినపప్పు ,
ఆవాలు, ఇంగువ  వేసి వేయించాలి .సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చిముక్కలు కరివేపాకువేసివేయించాలి.నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కొత్తిమీర తురుము ,ఉప్పు వేసి 5 నిమిషాలు  ఉడికించాలి .సగ్గుబియ్యంఉడికిన వెంటనే దించేయాలి .స్టవ్ మీద ఇడ్లీ స్టాండు పెట్టి నీళ్ళు పోసి ఇడ్లీ రేకులకి నూనె రాసి ఇడ్లీల్లా వేసుకుని 20 నిమిషాల పాటు ఉడికించాలి .

0 comments:

Post a Comment