Monday, December 1, 2014

(గోధుమ + జొన్న) రొట్టె

1) గోధుమపిండి ఒక భాగం , జొన్నపిండి రెండు భాగాలు , పుదినా , కొత్తిమీర పేస్టు కలిపి , తగినంత ఉప్పు కలిపి ,పెనం మీద వేసి రొట్టెలు లా తయారు చేసుకోవాలి. (ఈ రొట్టెలు చేసేటప్పుడు పాలకూర లేదా మెంతి కూర పేస్టు కూడా కావాలంటే కలుపుకోవచ్చు)
2) ఈ రొట్టెలలో పుష్కలంగా ఐరన్ , ప్రోటీన్ , ఫైబర్ (పీచు పదార్ధం) ఉంటుంది. కావాల్సిన కాల్షియమ్ కూడా అందుతుంది.
3) ఎవరైతే అధికబరువు , డయాబెటిస్ తో బాధపడుతున్నారో అలాంటి వారు , రాత్రి అన్నానికి బదులుగా , ఈ రొట్టెలు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ , కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
4) రాత్రి పూట 2 నుండి 4 రొట్టెలు వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రొట్టెలలో కార్బోహైడ్రేట్ లెవెల్స్ చాల చాల తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో గ్లూకోస్ లెవల్స్ , కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగవు.
5) ఈ రొట్టెలు తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి , చల్లగా తీసుకొంటే కడుపులో వేడి చేయదు.

0 comments:

Post a Comment