Saturday, November 2, 2013

వంటింటి చిట్కాలు మీ కోసం..

ఆహారంలోని తడిని కాపాడటంకోసం మూతపెట్టి ఉంచాలి.
ఆహారం తయారైన తరువాత వడ్డనకు ముందు కనీసం రెండు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి.
మైక్రోవోవెన్‌లో ఆహారం సమంగా ఉడకదు కాబట్టి ఆహారపు ఉష్ణోగ్రతను వివిధ
ప్రదేశాల్లో చూడటం మంచిది.
 ఆహారాన్ని ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలనే ఆయా పదార్థాల మీద, వంటకు
వెచ్చించే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదా.కు జంతు మాంసాలను మైక్రోఓవెన్లో
వండేటప్పుడు 165 డిగ్రీల ఫా.హీ (73.8 డిగ్రీల సెల్సియస్) ఉండాలి
 సాధారణ పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి ఆ తరువాత దానిపై దోశలు వేస్తే
నాన్‌స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి.
సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా
ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం
సరిపోతుంది.
 శనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి.
వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, తర్వాత వీటిని వేయించండి. చాల క్రిస్పీగా ఉంటాయి

వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది కూడా.

లేత సొరకాయ తరిగినపుడు లోపల ఉండే మెత్తని గుజ్జును బాగా నానిన బియ్యానికి జోడించి మెత్తగా రుబ్బాలి. అందులో అల్లం, మిర్చి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు కలిపి దోసెలు పోస్తే రుచిగా ఉంటాయి.

మరుగుతున్న 'టీ' పొడిలో చిటికెడు శొంఠి పొడి, రెండు యాలుకలు వేసి, 'టీ'ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.

మిగిలి పోయిన నిమ్మకాయ ఊరగాయను పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మిరపకాయ బజ్జీలు వేసి, వేడి వేడిగా తిని చూడండి. ఎంత రుచిగా ఉంటాయో?

బత్తాయి పండ్లని అయిదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే తొక్క కింద ఉండే తెల్లటి పొరని తేలిగ్గా వలిచేయవచ్చు.

బంగాళదుంప చిప్స్ మెత్తబడితే వాటిని నిముషం పాటు మైక్రోవేవ్ లో ఉంచితే కరకరలాడతాయి. బెండకాయ వేపుతున్నప్పుడు జిగురొచ్చి కూర ముద్దలా అవుతుంది. బాండీలో ముక్కలు వేయగానే కాస్త మజ్జిగకూడా వేసి కలిపితే జిగురు రాదు

బంగాళదుంపల చిప్స్ కరకరలాడాలంటే పసుపు రంగులో కనిపించే దుంపలను ఎంపికచేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తోలు తీసి, చిప్స్ వేయించేందుకు అనువైన ముక్కలుగా చేయాలి. నీళ్ళలోంచి తీసి వాటిపై మొక్కజొన్న పొడిని చల్లి వేయించాలి.

పూరీ పిండి కలిపేటప్పుడు సాధ్యమైనంత గట్టిగా కలుపుకుంటే పూరీలు నూనె పీల్చుకోవు. పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే, పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలిపి , పూరీ పిండి తయారు చేసుకోండి.

పులుసు, చారు మొదలైన వంటకాలలో పొరపాటున పులుపు ఎక్కువ పడవచ్చు. మజ్జిగ, పెరుగు మొదలైనవి విరివిగా పులిసి పోవచ్చు. అటువంటివాటిలో కొద్దిగా వంట సొడా కలిపితే మనకు కావలిసినంత రుచి తెచ్చుకోవచ్చు.

ప్రూట్ కేక్స్ పై ఒక టీ స్పూను గ్లిజరిన్ వేస్తే తాజాగా ఉంటాయి.

పరమాన్నం మరింత టేస్టీగా ఉండాలంటే, బియ్యాన్ని నెయ్యి వేసి కొంచెం సేపు వేయించి బియ్యంతో పరమాన్నం చేయాలి.

నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరు వెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి.

దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే, అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది. ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాల బాగుంటుంది.

టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి. టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి.

 ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.

0 comments:

Post a Comment