Friday, November 22, 2013

మిర్చి కా సాలన్

మిర్చి కా సాలన్
కావలసిన వస్తువులు:
మిరపకాయలు – 250 గ్రాములు
చింతపండు పులుసు – 1/4 కప్పు
పసుపు – 1/4 టీస్పూన్
కారం పొడి – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
మెంతి పొడి – 1/4 టీస్పూన్
పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్స్
నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్స్
ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
జీలకర్ర – 1/4 టీస్పూన్
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
మెంతులు – చిటికెడు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం తగ్గుతుంది. ప్యాన్‌లో నూనె వేడి చేసి మిరపకాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. ఒక గిన్నెలో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, పల్లీలపొడి, నువ్వుల పొడి, జీలకర్ర , మెంతిపొడి వేసి బాగా కలిపి ఉంచాలి. ఇందాక మిరపకాయలు వేయించిన ప్యాన్ లోనే నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక పొడులన్నీ కలిపిన చింతపండు పులుసు కప్పుడు నీళ్లు పోసి నిదానంగా మరిగించాలి. పులుసు, పొడులు ఉడికి కమ్మటి వాసన వస్తుండగా వేయించిన మిరపకాయలు, గరం మసాలా పొడి వేసి మరో ఐదునిమిషాలు మసాలాలో ఉడకనిచ్చి నూనె తేలగానే దింపేయాలి. కమ్మటి , ఘాటైన మిర్చి కా సాలన్ తయారైంది. ఈజీగా ఉంది కదా.. ఈ కూర బిరియాని. వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్ లకు, రొట్టెలకు కూడా బావుంటుంది.

0 comments:

Post a Comment