Monday, November 11, 2013

వంటింటి చిట్కాలు మీ కోసం..

వెల్లుల్లిపాయ పొట్టును తేలికగా తీయాలంటే వాటిని ఒక పాలిథిన్‌ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో కొంత సేపు ఉంచిన తర్వాత తీస్తే చాలా సులభంగా వచ్చేస్తుంది.
బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
 వెల్లుల్లిపాయ పొట్టును తేలికగా తీయాలంటే వాటిని ఒక పాలిథిన్‌ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో కొంత సేపు ఉంచిన తర్వాత తీస్తే చాలా సులభంగా వచ్చేస్తుంది.
బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది.
కిలో గోధుమలలో గుప్పెడు సనగలు చేర్చి మరపట్టిస్తే చపాతీలు తెల్లగా మరియు రుచిగా ఉంటాయి.
వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
snack వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది.
ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి.
నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు.
పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు.
పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.
నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది.
క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయ్యాలి.
కత్తిపీటకు ఉప్పురాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
చపాతీలు మరింత రుచిగా కావాలనుకుంటే ఈ విధంగా చేసి చూడండి. గోధుమపిండిలో కొద్దిగా బార్లీపిండి, శనగపిండి కలిపితే మంచి రుచిగా ఉంటాయి
అప్పడాల్లో కాస్త నూనె రాసి, దోసె పెనంపై కాల్చి అన్నంలోకి సైడిష్‌గా తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. నూనె వాడకం తగ్గుతుంది. ఆరోగ్యానికి మంచిది.
వేరుశనగపప్పు లడ్డు చేసేటప్పుడు బెల్లంతో పాటు కొద్దిగా చక్కెర కలిపితే ఎంతకాలమైనా లడ్డు తాజాగా ఉంటుంది.
పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే సుబ్రపడుతుంది.
బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినేసొడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది.
అరటిపండు పువ్వులను fridge లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన మారిపోతుంది.
కాలిఫ్లోవేర్, పాలకూర వంటి వాటిని శుబ్రం చేయటానికి నీటిలో కొద్దిగా వినేగార్ కలపండి.
ఆకు కూరలు ఉడికించిన నీటిని వృధాగా పారెయ్యకుండా soup ల తయారీలో వాడుకోవచు.
పాలలో మీగడ ఎక్కువగా రావాలంటే కాచడానికి ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.
అరటి, బంగాళ దుంప ముక్కల మీద ఉప్పు నీళ్ళు చల్లి పావుగంట అయ్యాక వేపుడు చేస్తే ముక్కలు బాగా వేగుతాయి.
ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.
రాత్రి మిగిలిన చపాతి లు గట్టిగా అయిపోయాయా , వాటి మీద కొంచెం నీళ్ళు చల్లి మరలా పెనం మీద వేడి చేసి చూడండి. అవి మరలా మృదువుగా తయారు అవుతాయి .
మాములుగా చలికాలంలో ఇడ్లి పిండి సరిగా పులవదు. ఇలాంటప్పుడు ఇడ్లి పిండి లో ముందే గనక ఉప్పు వేసి వుంచి నట్లు అయెతే పిండి పులుస్తుంది. అదే ఎండాకాలంలో నైట్ కూడా వేడీ బాగా వుండడం వల్ల పిండి బాగా పుల్లగా అయ్యిపోతు వుంటుంది. ఇలాంటప్పుడు పిండి లో ముందుగా ఉప్పు వెయ్యకుండా వుంటే సరిపోతుంది.
పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే సరి.
ఒక బంగాళాదుంప ను ముక్కలుగా కోసి పులుసు లో వేసి కాసేపు వుడికిన తరువాత స్టవ్ ఆపుచెయ్యండి.
ఇలా చేస్తే బంగాళాదుంప ముక్కలు కూర లో వున్న ఉప్పు ను పీల్చుకొని కూర లో వున్న ఉప్పు తగ్గుతుంది.
బొబ్బట్లు (భక్ష్యాలు) చేసేటప్పుడు తోపులో కొద్దిగా గోధుమ రవ్వ కలిపితే బొబ్బట్లు చిరగకుండా వస్తాయి.
కాకరకాయ ఆరోగ్యానికి మంచిది అన్న విషయం అందరికి తెలిసే వుంటుంది. కానీ కాకరకాయ లో వున్న చేదు కారణంగా దానిని తినడానికి చాల మంది ఇష్టపడరు .కాకరకాయ లో వున్న చేదు తగ్గాలంటే కాకరకాయను ముక్కలుగా కోసి వాటిని బియ్యం కడిగిన నీళ్ళలో ఒక గంట సేపు వుంచి నట్టు అయెతే చేదు అంతా పోతుంది.
దోసల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
ఉప్పు సీసాలో ఒక చెంచా మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారి ముద్ద కాదు.
ఎక్కువగా పండిన టమాటలను ఉప్పు కలిపిన చల్లని నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికల్లా తాజాగా మారుతాయి.
సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.

0 comments:

Post a Comment