Sunday, November 15, 2015

సగ్గుబియ్యం పకోడీ



కావలసిన పదార్థాలు 

 సగ్గుబియ్యం - ఒక గ్లాసు, మైదాపిండి - ఒక గ్లాసు, బియ్యంపిండి - అర గ్లాసు, పెరుగు - ఒక గ్లాసు, ఉల్లిపాయలు - నాలుగు, ఉప్పు - తగినంత, కారం - తగినంత, జీలకర్ర - ఒక చెంచా, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - వేయించడానికి సరిపడా.

తయారీ విధానం :
ముందుగా సగ్గుబియ్యాన్ని ఆరు గంటలపాటు పెరుగులో నాననివ్వాలి. ఆ తరువాత ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా తరగాలి. కరివేపాకును కూడా సన్నగా తరగాలి. ఆ తరువాత బాణలిని పొయ్యి మీద పెట్టి, నూనె సరిపడా పోయాలి. ఇప్పుడు నానపెట్టిన సగ్గుబియ్యంలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి కొంచెం వేడి నూనె పోసి కలపాలి. దాన్ని పకోడీల్లా వేయించుకోవాలి. అంతే కరకరలాడే వేడి వేడి సగ్గుబియ్యం పకోడీలు రెడీ.

0 comments:

Post a Comment