Sunday, November 15, 2015

సగ్గుబియ్యం మురుకులు

కావలసిన పదార్థాలు: 

బియ్యప్పిండి - 3 కప్పులు, సగ్గుబియ్యం - 1 కప్పు, కారం - 2 టీ స్పూన్లు, నువ్వులు - అర కప్పు, వెన్న -4 టేబుల్‌ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, నీరు - 2 కప్పులు.

తయారుచేసే విధానం: ఒక గిన్నెలో తగినన్ని నీటిలో సగ్గుబియ్యం వేసి కుక్కరులో ఉంచి, ఆవిరిపై 5 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్రలోకి ఉడికిన సగ్గుబియ్యం తీసుకుని అందులో కారం, నువ్వులు, ఉప్పు, బియ్యప్పిండి చేర్చి నీరు కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మురుకుల యంత్రం సహాయంతో తిప్పుకుంటూ, నూనెలో దోరగా వేగించుకోవాలి.

0 comments:

Post a Comment