Sunday, November 15, 2015

సగ్గుబియ్యం మురుకులు

కావలసిన పదార్థాలు:

 బియ్యప్పిండి - 3 కప్పులు, సగ్గుబియ్యం - ఒక కప్పు, కారం - 2 టీ స్పూన్లు, నువ్వులు - అరకప్పు, వెన్న - 4 టేబుల్‌ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని ఆవిరిమీద కుక్కర్లో 5 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో ఉడికిన సగ్గుబియ్యానికి కారం, నువ్వులు, ఉప్పు, బియ్యప్పిండి చేర్చి సరిపడా నీరు కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనిముట్టు సాయంతో మురుకులు వేసుకుని దోరగా వేగించుకోవాలి.

0 comments:

Post a Comment