Sunday, November 15, 2015

సగ్గుబియ్యం వడలు

కావలసిన పదార్థాలు:

 సగ్గుబియ్యం - 2 కప్పులు, ఆలుగడ్డ (పెద్దది) - 1, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, అల్లం తరుగు - 1 టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేసే విధానం: ఒక రాత్రంతా సగ్గుబియ్యం నానబెట్టి నీళ్లు వడగట్టాలి. ఉడికించి మెదిపిన ఆలులో సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, ఉల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని వడల్లా (పలచగా) వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. ఇవి పుదీనా చట్నీతో బాగుంటాయి.

0 comments:

Post a Comment