Wednesday, September 9, 2015

మైదాపిండి బిస్కెట్స్


మైదాపిండి బిస్కెట్స్ తినటానికి చాల రుచిగా వుంటాయి. ఇవి తయారుచేసుకోవడం చాలా సులువు. సాయంత్రం వేళ వేడి వేడి టీ లేదా కాఫితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన ధినుసులు:
మైదాపిండి – 500 గ్రాములు
వాము – ఒక స్పూన్
ఉప్పు – ఒక స్పూన్
కారం – రెండు స్పూన్స్
వెన్న – నాలుగు స్పూన్స్
నూనె – 500 గ్రాములు
నీళ్ళు - తగినన్ని
తయారుచేయువిధానము:
ఒక పళ్ళెం లో మైదాపిండి వేసుకోవాలి. అందులో వాము, ఉప్పు, కారం, మరియు వెన్నను కూడా వేడి చేసి పిండిలో కలిపి, నీళ్ళు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. రొట్టిల పీట మీద చపాతిలా చేసి, కత్తితో నిలువుగా అంటే ఒక చపాతీని నాలుగు లేదా ఐదు వరసులుగా వచ్చేటట్లు కోసి తరవాత అడ్డంగా బిస్కెట్స్ సైజులో చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఇలా చపాతీలన్నింటిని కోసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. కడాయిని పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగ కాగిన తరవాత ప్రక్కన పెట్టుకున్న బిస్కెట్స్ను కొంచె కొంచెంగా వేసి, వేయించుకోవాలి. అంతే!ఎంతో రుచిగా వుండే మైదాపిండి బిస్కెట్స్ రెడీ!

0 comments:

Post a Comment