Friday, August 21, 2015

నోరూరించే రవ్వ దోశ

కావలిసిన వస్తువులు :
మైదా పిండి-రెండు గ్లాసులు
బొంబాయి రవ్వ- ఒక గ్లాస్
బియ్యం పిండి -ఒక గ్లాస్
మజ్జిగ -ఒక గ్లాస్
పచ్చిమిరపకాయలు -నాలుగు
ఉల్లిపాయలు పెద్దవి -రెండు
ఉప్పు తగ్గినంత
జీల కర్ర - ఒక చెంచాడు
మిరియాలు ఒక పావు చెంచాడు
కొబ్బరి తురుము : ఒక టేబుల్ స్పూన్
కారట్ తురుము: ఒక టేబుల్ స్పూన్
జీడి పప్పు బద్దలు ; తగినన్ని
తయారీ విధానం:
దోశ తయారీకి ఒక గంట ముందుగా మైదా పిండి, రవ్వ, బియ్యమ పిండి ని మజ్జిగ తో కలపి, సరిపడినన్ని నీళ్ళు కలిపి పిండిని జాలు వారుగా (చిక్కటి మజ్జిగ లాగ)కలుపుకుని, ఉప్పుని, జీలకర్రని, మిరియాలని (కొంచెం కచ్చాపచ్చాగా కొట్టి), జీడి పప్పు బద్దలు చిన్నగా తుంపులు చేసినవి కలుపుకున్న పిండిలో వేసి, బాగా కలియపెట్టాలి.
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను సన్నగా తరుగుకుని వుంచుకొవాలి. పిండి రెండుగంటలు నానిన తర్వాత నాన్ స్టిక్ దోస పెనం తీసుకుని, మాములుగా మనం దోసలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుని, నూనె కూడా తగినంతగా వేసుకుని, పైన కావలసినంతగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి మరియు కారట్ తురుము దోశ అంతా జల్లు కోవాలి .
దోశ పలచగానే వేసుకుంటాం కాబట్టి రెండో వైపు కాల్చవలసిన అవసరం వుండదు. పిండిని పలచగా కలుపుకుని, బాగా స్ప్రెడ్ చేయడం వలన చిల్లులు చిల్లులుగా వచ్చి మాంచి క్రిస్పీ గా వస్తాయి దోశలు. మజ్జిగ లేనప్పుడు పిండిని రాత్రే నీళ్ళతో కలపి నాన పెట్టుకుని, ఉదయాన్నే దోశలు వేసుకోవచ్చు .

0 comments:

Post a Comment