Sunday, February 23, 2014

సగ్గుబియ్యం దోసెలు

సగ్గుబియ్యం దోసెలు : కావాల్సిన వస్తువులు: రెండు కప్పులు సగ్గు బియ్యం, ఒక కప్పు బియ్యం, ఒకకప్పు పెరుగు., నాలుగు పచ్చిమిర్చి, కొంచెం అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె.
సగ్గుబియ్యం, బియ్యం, కడిగి పెరుగు వేసి రెండు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. తరిగిన కొత్తిమీర వేసి కలిపి పెనం మీద దోసెలు వేసి, వేడిగా తినాలి. పల్చగా కరకరలాడే దోసెలతో ఏ పచ్చడీ లేకపోయినా బావుంటాయి.

0 comments:

Post a Comment