Wednesday, August 7, 2013

క్రిస్పీ పల్లీ పకోడీ :

కావల్సిన పదార్థాలు:
పల్లీలు: 2cups శెనగపిండి: 1.5cup
కరివేపాకు: మూడు రెమ్మలు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
మిరపపొడి: 1tsp ధనియాలపొడి: 1/2tsp
గరంమసాలా: 1/2tsp అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కొత్తిమీర: చిన్న కట్ట

తయారు చేయు విధానం: 
1. ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. 2. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. 3. తర్వాత పాన్ లో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. దీనిని పల్లీ చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి. అంతే పల్లీ పకోడీ రెడీ..

0 comments:

Post a Comment