Wednesday, July 31, 2013

క్యారెట్ అన్నం

క్యారెట్ అన్నం :
కావలసిన పదార్దాలు
బియ్యం - రెండు పెద్ద గ్లాసులు
క్యారెట్ తురుము - రెండు కప్పులు
ఉల్లి - ఒకటి
శెనగపప్పు - టేబుల్ స్పూన్
మినప్పప్పు - టేబుల్ స్పూన్
ఆవాలు, జీలకర్ర, గరం మసాలా - తగినంత
వేయించిన వేరు శెనగ - రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు - తగినంత
నూనె - రెండు టేబుల్ స్పూన్లు

తయారుచేయు విధానం :

1) బియ్యం లో తగినంత ఉప్పు కలిపి అన్నం వండుకోవాలి.
ఉడికిన అన్నం ఓ ప్లేటులో వేసుకుని ఆరబెట్టాలి. 2) స్టవ్‌పై కళాయి పెట్టి, నూనె కాగబెట్టాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వెయాలి.
3) అందులోనే శెనగపప్పు, మిన పప్పు వేసి వేయించాలి. తర్వాత ముక్కలు చేసిన పచ్చి మిరపకాయలు, ఉల్లి ముక్కలు కలపాలి.
4) తరువాత క్యారెట్ తురుము వేసి క్యారెట్ బాగా కలిసిన తర్వాత గరం మసాలా పొడి వేసి, పావు కప్పు నీళ్లు పోసి, క్యారెట్‌ను ఉడికించాలి .
5) ఇప్పుడు ఉడికించిన క్యారెట్ మిశ్రమాన్ని అన్నంలో కలిపి
దీనిలో వేయించిన వేరుశెనగ పప్పులు,కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి సర్వ్ చెయ్యాలి.

మినప జంతికలు

మినప జంతికలు :
కావలసినపదార్దాలు:
మినపప్పు : కప్పు
బియ్యప్పిండి : మూడు కప్పులు
కారం : టీ స్పూన్
నువ్వులు : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
వాము : టేబుల్ స్పూన్
వెన్న : టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడ

తయారుచేయు విధానం :

1) మినపప్పు నానబెట్టి కడిగి మెత్తగా రుబ్బాలి.
2) దీనిలో ఫైన చెప్పిన వాటిలో నూనె తప్పించి మిగతా
పధార్దాలన్ని వేసి ముద్దలా కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగాక ఈ ముద్దను కొద్దిగా తీసుకోని జంతికల గొట్టంలో పెట్టి కాగె నూనెలో జంతికలా వెయ్యాలి.
5) జంతికలు రెండు ప్రక్కల దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
అంతే మినప జంతికలు రెడీ.

ఇడ్లీ భర్గర్ :

ఇడ్లీ భర్గర్ :
పెద్ద ఇడ్లీ : ఒకటి
ఉడికించిన ఆలూ : అరకప్పు
ఉడికించిన క్యారెట్ : అర కప్పు
ఉడికించిన బఠాని : పావు కప్పు
ఉడికించిన స్వీట్ కార్న్ : పావుకప్పు
జీలకర్ర : అర టీ స్పూన్
గరం మసాలా : పావు టీ స్పూన్
కొత్తిమీర తురుము : టేబుల్ స్పూన్
టమాటా సాస్ : టీ స్పూన్
చిల్లి సాస్ : టీ స్పూన్
గుండ్రంగా కట్ చేసిన ఉల్లి ముక్కలు : మూడు
గుండ్రంగా కట్ చేసిన టమాటా ముక్కలు : మూడు
బ్రెడ్ పొడి : రెండు టీ స్పూన్లు

తయారు చేయు విధానం :

1) ఉడికించిన బఠాని, స్వీట్ కార్న్ విడివిడిగా మిక్సి పట్టాలి.
2) ఇడ్లిని బ్రెడ్ స్లైస్ లా మధ్యకు కట్ చెసి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు ఒక గిన్నెలోకి ఉడికించిన ఆలూ, క్యారెట్, మిక్సి వేసిన బఠానిముద్ద స్వీట్ కార్న్ ముద్ద, జీలకర్ర , ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
4) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వెడేక్కిన తరువాత ఒక స్పూన్ బ్రెడ్ పొడి వేసి కళాయి లో వెడల్పుగా చేసి దానిమీద ఆలూ మిశ్రమం ముద్దను గుండ్రంగా చేసి కళాయిలో వేసి దాని ఫైన మిగిలిన బ్రెడ్ పొడి వేసి చిన్న మంట మీద
రెండు నిముషాలు కాలనిచ్చి రెండో ప్రక్క తిప్పి ఒకనిముషం ఉంచి స్టవ్ ఆపాలి.
5) ఇప్పుడు ఇడ్లి ముక్కలు తీసుకోని రెండు ముక్కల మీద టమాటా సాస్ రాయాలి.
6) ఒక దాని ఫై వేడి చేసిన ఆలూ ముద్దమిశ్రమం పెట్టి దాని ఫై టమాటా ముక్కలు పెట్టి వాటి మీద ఉల్లి ముక్కలు పెట్టాలి.
7) వీటి ఫై చిల్లి సాస్ వేసి దానిఫై కొత్తిమీర జల్లి మిగిలిన ఇడ్లి ముక్కను దీని మీద పెట్టాలి.
అంతే ఇడ్లి బర్ఘర్ రెడీ

ఆనియన్-గార్లిక్ రైతా

ఆనియన్-గార్లిక్ రైతా :
ఇండియన్ వంటకాల్లో రైతా చాలా ఫేమస్ సైడ్ డిష్. సాధారణంగా రైతాను నీళ్ళు-చిలికిన పెరుగు మిశ్రమం, కొన్ని స్పైసీ(మసాలా దినుసుల)తో తయారు చేస్తారు. రైతాకు మసాలాలను కలిపుకొని తయారు చేసుకోవచ్చు. లేదా తాజా కూరగాయలతో ఉల్లిపాయలు, టమోటోలు, కీరకాయ, అవొకాడో వంటివి మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. అంతే కాదు, బూందీ చేర్చి స్వీట్ రైతాను కూడా తయారు చేసుకోవచ్చు. రైతా స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి ఏదైనా సరే రోటీ, రైస్, పులావ్, బిర్యానీలకు బెస్ట్ కాంబినేషన్. రైతా తయారు చేసిన తర్వాత రుచి చూసిన తర్వాత ఈ టేస్ట్ ను కొద్దికాలం పాటు మరచిపోలేరు. ఇది తాయారు చేయడం కూడా సులభం. మీరు కుకుంబర్ రైతాను చాలా సార్లు చేసుకొని ఉంటారు. అందుకే మసాలాదినుసులతో తయారు చేసే రైతా ఎలా ఉంటుందో మీరూ తాయారు చేసి రుచి చూడండి....

కావల్సిన పదార్థాలు:
పెరుగు: 2cups
ఉల్లిపాయలు: 1(చిన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 7-8
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కారం: 1tsp
జీలకర్ర: ½tsp
బ్లాక్ సాల్ట్: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp(గార్నిషింగ్ కోసం)
నూనె: ½tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి మీడియం మంట పెట్టాలి. పాన్ వేడవ్వగానే అందులో జీలకర్ర వేసి రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి. పక్కకు తీసి చల్లారిన తర్వాత రోలింగ్ స్టోన్ మీద వేసి రోలర్ తో రుద్ది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు కొద్దిగా నీళ్ళు వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు అందులోని వేయించుకొన్న వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.

3. ఇలా తయారు చేసుకొనేలోపు పాన్ లో ఒక టీస్పూన్ నూనె వేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగించాలి. తర్వాత కొద్దిగా కారం, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించిన తర్వాత వెంటనే ముందుగా కలిపి పెట్టుకొన్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో పోయాలి. అంతే ఉల్లిపాయ వెల్లుల్లి రైతా రెడీ. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.

బ్రేడ్ ఉప్మా

ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ గానీ, చపాతీ లు గానీ ఎక్సెస్ గా మిగిలిపోతే పారెయ్యకండి....(అంటే రాత్రికి మిగిలిపోతే మరునాడు ఉదయానికి చేసుకోవచ్చు - అంతేగాని ఎక్కువరోజులు నిలవుంచినవి కావు)

కావాల్సిన పదార్ధాలు:

బ్రేడ్ లేక చపాతీలు : చిన్న...చిన్న ముక్కలుగా తుంచుకోవాలి,

ఉల్లిపాయ: మీడియం సైజు: ఒకటి కట్ చేసి ముక్కలు చేయండి,
పచ్చి మిర్చి: రెండు,
కరేపాకు: కొద్దిగా...

పోపుకోసం;

నూనె: రెండు లేక మూడు చెంచాలు...

జీలకర్ర: అర టీ స్పూన్...
చిటికెడు : పసుపు, ఇంగువ....
ఉప్పు: రుచికి సరిపడా...
(బీ కేర్ ఫుల్: బ్రేడ్ మరియూ చపాతి ల్లో సాల్ట్ ఉండనే ఉంటుంది...అందుకని చిటికెడు...అంతకు కొంచెం ఎక్కువా....అంతే.....)

ఎలా చెయ్యాలి?

స్టవ్ మీద కొచెం విశాలంగా ఉన్న బాణలి పెట్టి వేడి చేయండి...

నూనె పోసి అది కాగిన తరువాత, జీలకర్ర, చిటికెడు ఇంగువ, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరేపాకు వేసి ఓ రెండు నిమిషాల పాటు ఫ్రీ చేయండి....ఇప్పుడు...చిటికెడు పసుపు, చిఉతికెడు ఉప్పు వేసి, ముక్కలుగా చేసిన బ్రేడ్ లేదా చపాతీ లను జత చేసి గరిటె తో బాగా కలియ తిప్పండి....ఆపై కొద్దిగా నీళ్ళను చిలకరించండి.....అంతే ఓ ఐదు నిమిషాల పాటు, స్టవ్ లో ఫ్లేం లో ఉంచి...అప్పుడప్పుడూ గరిటె తో కలుపుతూ ఉండండి....

ఇప్పుడు బ్రేడ్ ఉప్మాను ప్లేట్లల్లో సర్ది.....కొత్తిమీర తో డెకరేట్ చేయండి....వేడిగా తింటే...ఆహా ఏమి రుచి!!!!!

ఉప్పుడు పిండి

ఉప్పుడు పిండి

కావాల్సిన పదార్ధాలు

బియ్యం రవ్వ -- ఒకటిన్నర గ్లాసు
అల్లం -- అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు -- 14
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్
సెనగ పప్పు -- ఒక టేబుల్ స్పూన్
మినప పప్పు -- అర టేబుల్ స్పూన్
ఆవాలు -- అర టీ స్పూన్
జీలకర్ర -- ఒక టీ స్పూన్
కరివేపాకు -- రెండు రెమ్మలు
జీడిపప్పు -- 14 పప్పులు
నూనే -- ఒక గరిటెడు
నెయ్యి -- ఒక టేబుల్ స్పూన్
నీళ్ళు -- 3గ్లాసులు

తయారు చేసే విధానం ;-

ముందుగ అల్లం,పచ్చిమిరపకాయలను బాగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.తరవాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనే ,నెయ్యి వేసి సెనగ పప్పు,మినప పప్పు,ఆవాలు,జీలకర్ర ,జీడిపప్పు ను బద్దలుగా విడతీసి వెయ్యాలి.పోపు దోరగా వేగాక అల్లం,పచ్చిమిరప ముద్దను వేసి కరివేపాకును వేసి ఉప్పు కూడా వేసి ఒక ఐదు నిముషాలు వుంచి 3గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు మరగ నివ్వాలి.బుడగలు వచ్చే వరకు.ఇప్పుడు మరుగుతున్న ఎసరులో బియ్యపు రవ్వను పోసి గరిట తో బాగా కలిపి మూత పెట్టాలి.ఒక ఐదు నిముషాల తరువాత బాగా కలిపి ఉప్మాను కిందకు దించేయాలి స్టవ్ మీద నుంచి.అంతే ఘుమఘుమ లాడే రుచికరమైన ఉప్పుడు పిండి (బియ్యపు రవ్వ ఉప్మా ) రెడీ.

Thursday, July 18, 2013

(సోయా ) 65 :





కావలసిన పదార్దాలు
సోయా : కప్పు కారం : టీ స్పూన్ ఉప్పు : సరిపడా మైదా : రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ : రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు : టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి : పావు కప్పు ఉల్లి ముక్కలు : అర కప్పు నూనె : పావుకిలో చాట్ మషాలా : టీ స్పూన్ కొత్తిమీర : చిన్నకట్ట
తయారుచేయు విధానం :
సోయాను వేడి నీళ్ళల్లో వేసి రెండు నిముషాలు ఉంచి నీళ్ళు వంచి పక్కన పెట్టాలి. స్టవ్ ఫై నూనేవేది చెయ్యాలి.ఇప్పుడు సోయా ఒక గిన్నెలో వేసి దీనిలో మైదా,కార్న్ ఫ్లోర్, ఉప్పు,కారం,అల్లం వెల్లుల్లి పేస్టు, చాట్ మషాలా వేసి కలిపి కాగే నూనెలో వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి కాసేపు వేపాలి.దీనిలో అల్లం వెల్లుల్లి కలపాలి. ఇప్పుడు పెరుగులో కారం,ఉప్పు, చాట్ మషాలా కలిపి వేగుతున్న ఉల్లి మిశ్రమంలో వేసి కలిపి దీనిలో వేయించిన సోయా వేసి కలపాలి. పెరుగు అంతా యిగిరి పోయాక పొడిపొడిగా అయ్యిన తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి. అంతే సోయా 65 రెడీ.

Wednesday, July 17, 2013

పూరీలు



 
కావలసిన పదార్థాలు:-- గోధుమపిండి -- 1/4 కేజీ బొంబాయి రవ్వ -- 2 స్పూన్స్ పాలు -- 1 కప్పు నెయ్యి -- 1 స్పూన్ ఉప్పు -- తగినంత నూనె -- 1/2 కేజీ
తయారీ విధానం:--
ముందుగా గోధుమపిండిని బాగుచేసుకొని, పైనచెప్పిన పదార్థాలు అన్నీ వేసి, తగినంత నీరు పోసుకుంటూ, బాగా కలిపి, అరగంట నానబెట్టాలి. పిండి నానిన తరవాత బాగా మదాయించి, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పూరీలు వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, వేడి అయ్యాక ఒక్కొక్క పూరీని వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక ప్లేట్ లో అమర్చుకోవాలి. పూరీలను ఎప్పుడూ విడి - విడిగా పేర్చుకోవాలి, ఒకదానిపై ఒకటి పెట్టకూడదు, అలా పెడితే మెత్తబడతాయి. బొంబాయి రవ్వ వెయ్యటంతో కొంచెం కరకరలాడుతూ (క్రిస్పీగా) ఉంటాయి. అంతే వేడి వేడి పూరీలు రెడీ. మనకి నచ్చిన కూర లేదా సాంబార్ తో తినొచ్చును.

Friday, July 12, 2013

ఆలూ చెక్కలు



కావల్సినవి:
బంగాళాదుంపలు- నాలుగు, బియ్యంపిండి- రెండు కప్పులు, మొక్కజొన్న పిండి- అరకప్పు, వంటసోడా- చిటికెడు, నువ్వులు- ఆరు చెంచాలు, పచ్చిమిర్చి- ఐదు, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, వెల్లుల్లి రేకలు - ఆరు, ఉప్పు- రుచికి తగినంత, ధనియాల పొడి- రెండు చెంచాలు, కొత్తిమీర, పుదీన - కట్ట చొప్పున, కరివేపాకు- కొద్దిగా, జీలకర్ర- చెంచా, ఉల్లికాడల తరుగు- అరకప్పు.
తయారీ:
ముందుగా బంగాళాదుంపలను ఉడికించి చల్లారాక పొట్టుతీసి చేత్తో మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలను మెత్తగా ముద్ద చేసుకోవాలి. గిన్నెలోకి బంగాళాదుంప మిశ్రమం, పచ్చిమిర్చి ముద్ద, బియ్యంపిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, ధనియాలపొడి, జీలకర్ర, నువ్వులు, వంటసోడా, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకొని నీళ్లు చేర్చకుండా గట్టిగా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక పిండిని ఉండలా చేసి చేత్తో అదిమి వేయాలి. బాగా వేగాక తీస్తే కరకరలాడే ఆలూ చెక్కలు సిద్ధమయినట్టే.
ఒకసారి ట్రై చెయ్యండి ..

(బహుళ ధాన్యాలు) పిండి



ఒక కెజి బియ్యం తింటే వచ్చే బలం కేవలం ఒక్క నూట ముప్పయ్ గ్రాముల గోధుమలు తింటే వస్తుందన్నమాట. 
అన్నిటికన్నా మంచి పొషకవిలువలు గలిగినది మల్టి గ్రైన్ (బహుళ ధాన్యాలు) పిండి. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లి, సోయా బీన్స్, మొక్క జొన్నలు, కొర్రలు .. ఇవే కాకుండా ఇంకా బాదం పప్పు, జీడి పప్పు ... ఇలా అన్ని కలిపి పిండి చేసుకుని జావ లాగా తయారు చెసుకుని రోజూ ఏదో ఒక సమయం లో తాగుతూ ఉంటే .. పోషకాహార సమస్యలెమీ తలెత్తవు..ఇంకా ఇది తీసుకున్నవారు చాలా ఆరొగ్యం గా ఉంటారు.

ఈ బహుళ ధాన్యాల పిండి బయట చాలా కంపనీలు తయారు చేసి అమ్ముతున్నారు..కానీ స్వయం గా చెసుకుంటే చాలా మంచిది. పిల్లల ఎదుగుదలలో ఈ పిండి చాలా ఉపయోగపడుతుంది.
గోధుమలు -- 1 కెజి
రాగులు -- 1 కెజి
జొన్నలు -- 1 కెజి
సజ్జలు -- 1 కెజి
బార్లి -- 1 కెజి
మొక్క జొన్నలు -- 1 కెజి
సోయా బీన్స్ -- 250 గ్రాములు

అన్నిటిని, శుభ్రముగా కడిగి, పొట్టు ఉంటే తీసేసి .. కలిపి పిండి కొట్టించాలి.
సోయా బీన్స్ లో ఎక్కువ పొషకాలుంటాయి..కాని అవి ఎక్కువ కలిపితే చేదుగా ఉంటుంది.
అందువల్ల 250 గ్రాములు చాలు.

పయిన చెప్పిన ఏడు ఖచితంగా ఉండాలి. ఇంకా
అలసందలు -- 1 కెజి
అల్మండ్స్ -- 100 గ్రాములు
జీడిపప్పు -- 250 గ్రాములు
బాదం పప్పు -- 250 గ్రాములు
పిస్తా పప్పు -- 250 గ్రాములు

పిండి గా చేసి కలుపుకోవచ్చు .

ఈ పిండిని, నీళ్ళలో చాలా సేపు తిప్పి పేస్టు లా అయ్యాక జావ తయారు చేసుకోవాలి. లేకపోతే ఉండలు ఉండలు గా అవుతుంది.

ఇది రోజూ తీస్కుంటే మాత్రం ఇక మందులు వాడాల్సిన పని ఉండదు.

Thursday, July 11, 2013

మైసూరు బోండాలు

మైసూరు బోండాలు

కావలసిన పదార్థాలు:--
మైదాపిండి -- 2 కప్పులు
బియ్యంపిండి -- 1/2 కప్పు
పుల్లటి పెరుగు -- 2 కప్పులు
బొంబాయి రవ్వ -- 4 స్పూన్స్
అల్లం + పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు -- తగినంత
వంటసోడా -- 1/4 స్పూన్
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--
పైన చెప్పిన పదార్థాలు అన్నీ.... పుల్లటి పెరుగులో వేసి 2 గంటలు ముందు నానబెట్టుకోవాలి.ఈ పిండి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా నానితే, బోండాలు అంత మెత్తగా, మృదువుగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత, పిండిని కొంచెం-- కొంచెం చేతితో చిన్ని -చిన్ని ఉండలుగా తీసుకొని, నూనెలో వేస్తే గుండ్రంగా బోండాలు, పెద్దవిగా పొంగుతాయి. ఇలాగే అన్నీ వేయించి తీసుకొని, మనకి నచ్చిన చెట్నీతో తినొచ్చును. అంతే వేడి -- వేడి మెత్తని మైసూరు బోండాలు రెడీ......

రవ్వ ఇడ్లీ:--

రవ్వ ఇడ్లీ:--

కావలసిన పదార్థాలు:--
బొంబాయి రవ్వ -- 1/4 కేజీ
అల్లం పేస్టు -- 1 స్పూన్
పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు -- రుచికి తగినంత
చిక్కటి పెరుగు -- 3 కప్పులు
కరివేపాకురెబ్బలు -- 4
పోపు సామాన్లు -- కొద్దిగా
నెయ్యి -- కొంచెంగా

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, 2 స్పూన్స్ నెయ్యివేసి, కరిగాక, బొంబాయి రవ్వను వేసి, మాడకుండా సన్నని మంటపై గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ఒక గిన్నెలో వేసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలిలో, పోపు వేసుకొని, అందులో అల్లం-- పచ్చిమిర్చి పేస్ట్లు , కరివేపాకు, పెరుగు వేసి, అందులోనే వేయించి పక్కనపెట్టుకున్న రవ్వను కూడా వేసి, బాగా కలియపెట్టి 2 నిముషాలు ఉంచి దించి పక్కనపెట్టుకోవాలి.

చల్లారిన తరవాత ఇడ్లీస్టాండ్ తీసుకొని, నూనె రాసుకొని, ఆ రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని, కుక్కర్ లో పెట్టి, స్టవ్ వెలిగించి, కుక్కరు పెట్టి, 15 నిముషాలు ఉంచితే ఇడ్లీలు రెడీ. అంతే వేడి - వేడి రవ్వ ఇడ్లీలు మీ ముందు సిద్దం. ఈ వేడి-- వేడి ఇడ్లీలలను కొబ్బరి చట్నీతో తింటే చాలా బావుంటుంది. లేదా మనకి ఇష్టమైన చట్నీలతో తినొచ్చును.

ఈ రవ్వ ఇడ్లీలు చేసుకోవటం చాలా సులువు. పప్పు నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం వంటి ఇబ్బందులు పడకుండాఉంటాము. మనకి అర్జెంటుగా ఇడ్లీలు కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చును.

Thursday, July 4, 2013

సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం వడలు
కావలసిన పదార్థాలు:--
సగ్గుబియ్యం -- 1 కప్పు
బియ్యంపిండి --1 కప్పు
శెనగపిండి -- 2 స్పూన్స్
పచ్చిమిర్చి పేస్టు -- 1 స్పూన్
జీలకర్ర పౌడర్ -- 1 స్పూన్
పెరుగు -- 1 కప్పు
ఉప్పు --- తగినంత
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--
2 గంటల ముందుగా సగ్గుబియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి. బాగా ననిన తరవాత దానిలో బియ్యంపిండి, శెనగపిండి, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర పౌడర్ & ఉప్పు వేసి, గారెల పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగాక, ఒక పాలకవరు మీదైనా, లేకుంటే చేతిమీదనైనా పిండిని తీసుకొని, గుండ్రంగా చేసి నూనెలో వేసుకొని, గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. మనకి నచ్చిన చెట్నీతో నంజుకొని తినొచ్చును. అంతే వేడి -- వేడి, కరకరలాడే కమ్మని సగ్గుబియ్యం వడలు రెడీ.(ఇష్టమైన వారు ఈ పిండిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చును)